ప్రజాధనాన్నిదుర్వినియోగం చేస్తున్న కాంగ్రెస్, బిఆర్ఎస్ లు
చేగుంట తెలంగాణ ప్రజాధనాన్ని వృధా చేస్తున్న అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బిఆర్ఎస్అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయి మూడు రోజులు అవుతున్న బిఆర్ఎస్ వాళ్ళు తిట్టుడు కాంగ్రెస్ వాళ్ళని కాంగ్రెస్ వాళ్లు టిఆర్ఎస్ వాళ్ళని తిట్టుకొనుడు తప్ప ఏమీలేదని మాసాయిపేట బిజెపి మండల అధ్యక్షుడు మొలుగు నాగేందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజా సమస్యల గురించి పట్టించుకున్న పాపాన పోని రెండు పార్టీలు దొంగల దొంగలు ఊర్లు పంచుకున్నట్టు ఉంది ఈ రెండు పార్టీల లెక్క విద్యార్థులకు సంబంధించిన ఫీజు రియంబర్మెంట్ కోసం గానీ రైతులను ఇబ్బంది పెడుతున్న 22ఏ పైన కానీ ఇంకా ఉద్యోగస్తుల గురించి గానీ రైతులకు యూరియా దొరకట్లేదు దాని గురించి గానీ ఇంకా చాలా ప్రజా సమస్యల గురించి చర్చించకుండా కాంగ్రెస్ వాళ్లు మరియు బిఆర్ఎస్ వాళ్లు తిట్టుకోవడానికి ఈ అసెంబ్లీ సమావేశాలు పెట్టినట్లుగా ఉంది అసెంబ్లీ సమావేశాల పేరుతో వేలకోట్ల ప్రజాధనం వృధా అవుతుంది. ఇప్పటికైనా రెండు పార్టీలు బుద్ధి తెచ్చుకొని ప్రజా సమస్యలపై చర్చించాలని భారతీయ జనతా పార్టీ మాసాయిపేట మండల శాఖ తరపున డిమాండ్ చేస్తున్నాము
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


