ఆగస్టు 15 వేడుకల ఏర్పాట్లను పర్యవేక్షించిన ఇన్చార్జ్ కలెక్టర్, పోలీస్ కమిషనర్
నిజామాబాద్ :నిజామాబాద్లో ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరుగుతున్న ఏర్పాట్లను నిజామాబాద్ ఇన్చార్జ్ కలెక్టర్ భవేష్ మిశ్రా, నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, .పర్యవేక్షించారు. ఈ సందర్భంగా పరేడ్ గ్రౌండ్లో వేదిక , బారికేడింగ్ , అతిథుల కూర్చునే ఏర్పాట్లు , పార్కింగ్ , ట్రాఫిక్ నియంత్రణ , భద్రతా చర్యలు తదితర ఏర్పాట్లను పరిశీలించారు. వేడుకలకు హాజరయ్యే ప్రజలు , అధికారులు , ప్రముఖులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లను సమన్వయంతో పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఆగస్టు 15న నిర్వహించనున్న కార్యక్రమం విజయవంతంగా , ప్రశాంత వాతావరణంలో జరిగేలా పటిష్టమైన బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులను ఆదేశించారు. వేడుకలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను నిర్ణీత సమయానికి పూర్తి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) భుజంగ రావు , ఎ.ఆర్ ఏసిపి శ్రీ శ్రీరాములు , మున్సిపల్ కమిషనర్ శ్రీ దిలీప్ కుమార్ , నిజామాబాద్ ఏసిపి శ్రీ ప్రకాష్ , స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ రెడ్డి , సి.ఐలు , ఆర్.ఐ లు మరియు తదితరులు పాల్గొనడం జరిగింది.
Views: 0
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
14 Aug 2026 17:43:36
లింగాల గణపురం (జనగాం)కుందారం: కుందారం గ్రామ పంచాయతీలో గత 20 సంవత్సరాలుగా సపాయి కార్మికుడిగా సేవలందించిన పాలమాకుల ఐలయ్య ఈరోజు ఆకస్మికంగా మృతి చెందారు. ఆయన పార్థీవ...
