విద్యార్థులకు స్టీల్ ప్లేట్లు, గ్లాసుల పంపిణీ
దౌల్తాబాద్, సిద్ధిపేట : ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సంక్షేమం కోసం ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని గ్రామ సర్పంచ్ ముచ్చమర్రి అనురాధ రమేష్ అన్నారు. శుక్రవారం దౌల్తాబాద్ కేజీబీవీ హాస్టల్లో నిర్వహించిన కార్యక్రమంలో 6వ తరగతి విద్యార్థులకు ప్రభుత్వం అందజేసిన స్టీల్ ప్లేట్లు, గ్లాసులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ ముచ్చమర్రి అనురాధరమేష్, ఉప సర్పంచ్ ఆది బాలకృష్ణ మాట్లాడుతూ, విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. పాఠశాలల్లో పరిశుభ్రతతో పాటు ఆరోగ్యకరమైన అలవాట్లను అలవరచుకోవాలని విద్యార్థులకు సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రతి సంక్షేమ పథకాన్ని సద్వినియోగం చేసుకొని విద్యలో రాణించాలని ఆకాంక్షించారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


