బిజినాపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల ప్రధానాచార్యులు ఏ.సుమతికి
ఉత్తమ ప్రిన్సిపాల్ అవార్డు" సేవలకు గుర్తింపు.. బాధ్యతలు మరింత పెరిగాయీ సుమతి
నాగర్ కర్నూల్.బిజినాపల్లి, :విద్యారంగంలో విశేష సేవలకు గుర్తింపుగా బిజినాపల్లి లోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర కళాశాల పాఠశాల ప్రధానాచార్యులు సుమతి రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రిన్సిపాల్ అవార్డు" దక్కింది. సోషల్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ అవార్డు ప్రదాన కార్యక్రమంలో సుమతి గారి సేవలను కొనియాడారు. పేద, బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంలో, క్రమశిక్షణ, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో విద్యార్థులను ముందుండి నడిపించడంలో ఆమె చూపిన కృషిని గుర్తించి ఈ అవార్డును ప్రదానం చేశారు. ఈ సందర్భంగా సుమతి మాట్లాడుతూ, "ఈ అవార్డు నాకు వ్యక్తిగత గౌరవం మాత్రమే కాదు. మా సంస్థలోని అందరు ఉపాధ్యాయుల, సిబ్బంది సమిష్టి కృషికి దక్కిన ఫలితం. ఈ అవార్డు రావడంతో నా బాధ్యతలు మరింత పెరిగాయని భావిస్తున్నాను. భవిష్యత్తులో ఇంకా మెరుగైన ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తాను" అని ఆనందం వ్యక్తం చేశారు. ఈ అవార్డు రావడానికి తోడ్పడిన అందరు అధ్యాపకులకు, సిబ్బందికి, విద్యార్థులకు ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవార్డు వార్త తెలియగానే బిజినాపల్లి గురుకులంలో సంబరాలు వెల్లువెత్తాయి. విద్యార్థులు, తల్లిదండ్రులు, స్థానికులు సుమతి గారిని అభినందించారు.
Views: 0
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
14 Aug 2026 17:43:36
లింగాల గణపురం (జనగాం)కుందారం: కుందారం గ్రామ పంచాయతీలో గత 20 సంవత్సరాలుగా సపాయి కార్మికుడిగా సేవలందించిన పాలమాకుల ఐలయ్య ఈరోజు ఆకస్మికంగా మృతి చెందారు. ఆయన పార్థీవ...
