చినుకు పడితే చిత్తడే.. విద్యార్థులకు తప్పని ఇబ్బందులు
కారేపల్లి: (ఖమ్మం) మండలంలోని కారేపల్లి బీసీ కాలనీలో వర్షం కురిసిన ప్రతిసారి సమస్యలు తలెత్తుతున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు అంగన్వాడీ కేంద్రం, పాఠశాల పరిసరాల్లో భారీగా వర్షపు నీరు నిలిచిపోయింది.దీంతో విద్యార్థులు,చిన్నారులు పాఠశాలలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.పాఠశాల ఆవరణలో నీరు నిలిచిపోవడంతో చిత్తడిగా మారి,విద్యార్థులు జారిపడే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో వర్షపు నీరు బయటకు వెళ్లే మార్గం లేక ఆవరణలోనే నిలిచిపోతోందని పేర్కొంటున్నారు.“చినుకు పడితే చిత్తడే” అన్నట్లుగా పరిస్థితి మారిందని స్థానికులు వాపోతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి పాఠశాల, అంగన్వాడీ పరిసరాల్లో డ్రైనేజీ సౌకర్యం కల్పించి, వర్షపు నీరు నిలవకుండా శాశ్వత పరిష్కారం చూపాలని వారు కోరుతున్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


