ఉమ్మడి మెదక్ జిల్లా అండర్-18 ఖో ఖో పోటీలు ఘనంగా ప్రారంభం
ఉమ్మడి మెదక్ జిల్లా స్థాయి అండర్-18 ఖో ఖో పోటీలు ఘనంగా నిర్వహించారు. ఈ పోటీల్లో ఉమ్మడి మెదక్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 348 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని పీఆర్టీయూ మెదక్ జిల్లా సెక్రెటరీ సామ్యా నాయక్ మరియు టీజీడబ్ల్యూఆర్జేసీ ప్రిన్సిపాల్ బసవరాజు ఉమ్మడి మెదక్ జిల్లా ఖో ఖో జనరల్ సెక్రెటరీ శ్రీకాంత్ గౌడ్ ట్రెజరర్ నాగ గౌడ్ వైస్ ప్రెసిడెంట్ రామేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు క్రీడాకారులను అభినందిస్తూ, క్రీడలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని తెలిపారు. పోటీల్లో క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి జిల్లా, రాష్ట్ర స్థాయిలో మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో క్రీడాకారులు, కోచ్లు, నిర్వాహకులు, క్రీడా సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


