డిజిటలైజేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలి
మందమర్రి,(మంచిర్యాల) : ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా ప్రజలకు అందించిన ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. శుక్రవారం క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పరిధిలోని 3,19 వార్డులలో కొనసాగుతున్న సర్ ప్రక్రియను కలెక్టర్ కుమార్ దీపక్,మందమర్రి తహసిల్దార్ సతీష్ కుమార్ పరిశీలించారు. ఎన్యుమరేషన్ ఫారాలలో నింపిన ఓటర్ల వివరాలను బిఎల్ఓ యాప్ లో స్పష్టంగా నమోదు చేయాలన్నారు. అనంతరం మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించారు. అదనపు గదులు,భోజనశాల నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పించి నాణ్యమైన విద్య అందిస్తామని పేర్కొన్నారు.
Views: 1
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
19 Jul 2026 00:48:51
ప్రభుత్వ హాస్పిటళ్ల పనితీరు మెరుగుపడిందని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు.
మెరుగైన వైద్య సేవలు అందిస్తుండడంతో, ప్రభుత్వ హాస్పిటళ్లకు వచ్చే సంఖ్య కూడా పెరుగుతోందని మంత్రి...
