కనకదుర్గమ్మను దర్శించుకున్న ప్రభుత్వ మాజీ చీఫ్ విప్
హన్మకొండ న్యూస్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడలోని కనకదుర్గ అమ్మవారిని ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, మాజీ శాసనసభ్యులు దాస్యం వినయ్ భాస్కర్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఇంద్రకీలాద్రికి చేరుకున్న మాజీ చీఫ్ విప్ దంపతులకు, కుటుంబ సభ్యులకు ఆలయ అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం వారు అంతరాలయంలో శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. దర్శనానంతరం ఆలయ మండపంలో వేద పండితులు వారికి మంత్రపుష్పాలతో వేదాశీర్వచనం (ఆశీర్వాదాలు) పలికారు. ఆలయ అధికారులు అమ్మవారి శేషవస్త్రం, పవిత్ర తీర్థప్రసాదాలు, అమ్మవారి చిత్రపటాన్ని వారికి బహూకరించి గౌరవించారు.అమ్మవారి దర్శనం అనంతరం దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ... "దుర్గమ్మ తల్లి కృపాకటాక్షాలతో రెండు తెలుగు రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో వర్ధిల్లాలని ప్రార్థించాను. అమ్మవారి దర్శనం అత్యంత భక్తిశ్రద్ధలతో, ప్రశాంతంగా జరిగింది. ఆలయ అధికారులు చేసిన ఏర్పాట్లు, ప్రోటోకాల్ మర్యాదలు చాలా బాగున్నాయి" అని పేర్కొన్నారు.
Views: 3
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
19 Jul 2026 00:48:51
ప్రభుత్వ హాస్పిటళ్ల పనితీరు మెరుగుపడిందని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు.
మెరుగైన వైద్య సేవలు అందిస్తుండడంతో, ప్రభుత్వ హాస్పిటళ్లకు వచ్చే సంఖ్య కూడా పెరుగుతోందని మంత్రి...
