ఈ నెల 31లోపు రేషన్ కార్డుల ఈ-కేవైసీ పూర్తి చేయాలి
దౌల్తాబాద్ ,సిద్ధిపేట: జిల్లాలోని రేషన్ కార్డుదారులందరూ ఈ నెల 31లోపు తప్పనిసరిగా ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలని జిల్లా పౌరసరఫరాల అధికారి తనూజ సూచించారు. తెలంగాణ పౌర సరఫరాల శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అర్హులైన లబ్ధిదారులకు ఆహార ధాన్యాల పంపిణీ నిరంతరాయంగా కొనసాగించేందుకు ఈ ప్రక్రియ చేపట్టినట్లు తెలిపారు.జిల్లాలో మొత్తం 10,47,075 మంది లబ్ధిదారులు ఉండగా, ఇప్పటివరకు 8,48,446 మంది ఈ-కేవైసీ పూర్తి చేసుకున్నారని, ఇది 81.03 శాతానికి సమానమని పేర్కొన్నారు. కొన్ని రేషన్ కార్డుల్లో కుటుంబ సభ్యులలో కొందరు మాత్రమే ఈ-కేవైసీ పూర్తి చేయగా, మిగిలిన వారు ఇంకా చేయించుకోలేదని తెలిపారు. ఈ-కేవైసీ పూర్తి చేయని కుటుంబ సభ్యుల వివరాలను క్షేత్రస్థాయి సిబ్బందికి అందజేసి, వారిని సంప్రదించి ప్రక్రియ పూర్తి చేయించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఇంకా ఈ-కేవైసీ చేయించుకోని వారు తమ సమీప చౌక ధరల దుకాణాన్ని సంప్రదించి వెంటనే పూర్తి చేసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


