ప్రత్యేక ఓటరు జాబితా సవరణపై సమీక్ష
బెల్లంపల్లి,/మంచిర్యాల: బెల్లంపల్లి మాజీ జెడ్పీటీసీ, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కరుకూరి రాంచందర్ బెల్లంపల్లి మండలం సోమగూడెం గ్రామపంచాయతీ పరిధిలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంపై బీఎల్వోతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటరు నమోదు, ఓటర్ మ్యాపింగ్, పూర్తయిన దరఖాస్తులు, పెండింగ్లో ఉన్న దరఖాస్తులు తదితర అంశాలపై సమగ్రంగా ఆరా తీశారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలని, పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


