మున్నూరుకాపు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా తోట సత్యం
స్టేషన్ ఘన్పూర్, (జనగామ): మున్నూరుకాపు సంఘం జనగామ జిల్లా ఉపాధ్యక్షునిగా మున్సిపల్ పరిధిలోని శివునిపల్లి గ్రామానికి చెందిన తోట సత్యం ఎన్నికైనట్లు సంఘం జిల్లా అధ్యక్షుడు నల్లగొండ మహేందర్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పోగుల సారంగపాణి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా సత్యం మాట్లాడుతూ నాపై నమ్మకంతో బాధ్యతను అప్పగించిన పెద్దల నమ్మకాన్ని వమ్ము చేయకుండా మున్నూరు కాపు సంఘం బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు. నాబాధ్యతకు సహకరించిన రాష్ట్ర, జిల్లా, మండల నేతలకు కృతజ్ఞతలు తెలిపారు.
Views: 161
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
27 Jul 2026 20:44:32
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై రాష్ట్ర శక్తి (కార్మిక, ఉపాధి, శిక్షణ & ఫ్యాక్టరీలు) మరియు గనుల శాఖ మంత్రి డా....
