మంచిర్యాల బిజెపి ఆధ్వర్యంలో దీపోత్సవం
మంచిర్యాల టౌన్. భారతీయ జనతా పార్టీ మంచిర్యాల కార్పొరేషన్ సెంట్రల్ జోన్ గరిమెళ్ళ జోన్ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ జన్మదిన పురస్కరించుకొని మంచిర్యాల రైల్వే స్టేషన్ ఆవరణలో దీపోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ నరేంద్ర మోడీ గత 25 సంవత్సరాలుగా దేశానికి సమాజానికి సేవ చేస్తూ నిర్విరామంగా కష్టపడుతున్న తీరు ను కొనియాడారు యావత్ సమాజానికి మార్గ దర్శకుడిగా ఉంటూ ప్రపంచంలోనే భారత దేశాన్ని పరమ వైభవ స్థితిలోకి తీసుకు వెళుతున్నారని మరియు దేశాన్ని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్తూ ప్రపంచంలో ఉన్న భారతీయుల అందరి మన్ననలు పొందుతున్నారని నరేంద్ర మోడీ గారిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని కొనియాడారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


