డీజే అడ్వాన్స్ వివాదానికి పోలీసుల పరిష్కారం!
- మద్నూర్ పోలీసుల చొరవతో ఉత్సవ నిర్వాహకులకు రూ.5 వేల అడ్వాన్స్ తిరిగి
- ఇరువర్గాలకు కౌన్సెలింగ్ ఇచ్చి సమస్యను సామరస్యంగా పరిష్కరించిన ఎస్సై మోహన్ రెడ్డి
మద్నూర్, : గణేష్ నిమజ్జన కార్యక్రమంలో డీజేకు అనుమతి లేకపోవడంతో డీజేను రద్దు చేసుకున్న ఉత్సవ నిర్వాహకులకు మద్నూర్ పోలీసులు న్యాయం చేశారు. మరేపల్లి గ్రామంలోని ఏకదంత గణేష్ మండలి నిర్వాహకులు రెండు నెలల క్రితం ఖండేబల్లూర్కు చెందిన డీజే నిర్వాహకుడికి రూ.5 వేలు అడ్వాన్స్గా చెల్లించారు. ఇటీవల డీజేలకు అనుమతి లేదని పోలీసులు సూచించడంతో నిర్వాహకులు డీజేను రద్దు చేసుకున్నారు. అయితే చెల్లించిన అడ్వాన్స్ తిరిగి ఇవ్వకపోవడంతో బాధితులు మద్నూర్ ఎస్సై మోహన్ రెడ్డిని ఆశ్రయించారు. దీనిపై వెంటనే స్పందించిన ఎస్సై ఇరువర్గాలను పోలీస్స్టేషన్కు పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించారు. అనంతరం డీజే నిర్వాహకుడి నుంచి రూ.5 వేలు అడ్వాన్స్ను ఉత్సవ నిర్వాహకులకు తిరిగి ఇప్పించారు. గణేష్ నిమజ్జన వేడుకలను ప్రశాంతంగా, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించుకోవాలని పోలీసులు సూచించారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


