అధికారుల సహకారంతోనే జిల్లా సమగ్రాభివృద్ధికి శక్తియులా కృషి చేశా...
- వీడ్కోలు సమావేశంలో పూర్వ కలెక్టర్ పమేలా సత్పతి

అక్కున చేర్చుకున్న కరీంనగర్ ను కన్న ఊరులా ఎప్పటికీ మర్చిపోలేను...
కరీంనగర్ : జిల్లా కలెక్టర్గా అభివృద్ధి చేసే గొప్ప అవకాశాన్ని కరీంనగర్ ఇచ్చిందని, కన్న ఊరు లాగా ప్రజలంతా అక్కున చేర్చుకోవడం జీవితంలో మర్చిపోలేనని కరీంనగర్ పూర్వ కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు...కరీంనగర్ లోని జింకల పార్కులో సోమవారం రాత్రి జిల్లా అధికారుల ఆధ్వర్యంలో కరీంనగర్ పూర్వ కలెక్టర్ పమేలా సత్పతికి ఆత్మీయ వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అన్ని విభాగాల జిల్లా అధికారులు టీఎన్జీవో టీజీవో తాసిల్దారులు ఎంపీడీవోలు అధికారులందరూ పూర్వ కలెక్టర్ పమేలా సత్పతి ఘనంగా సత్కరించారు.

కరీంనగర్ జిల్లా గొప్ప అవకాశం కల్పించింది..
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ భావద్వేగ పూరితంగా ప్రసంగించారు. రెండు సంవత్సరాల నాలుగు నెలలపాటు కరీంనగర్ జిల్లా కలెక్టర్ గా పనిచేయడం గొప్ప అవకాశం అని పేర్కొన్నారు. జిల్లా అధికారులు, కిందిస్థాయి సిబ్బంది సహకారంతో తన శాయశక్తుల సమగ్ర అభివృద్ధికి కృషి చేశానని పేర్కొన్నారు. ఇందులో అందరి సహకారం ఎల్లవేళలా మరువలేనని పేర్కొన్నారు. కన్న ఊరు కోరాపూట్ తర్వాత జీవితంలో ఎప్పటికీ కరీంనగర్ జిల్లాను మరిచిపోలేని పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా కన్న తల్లి లాగా అక్కున చేర్చుకుందని తెలిపారు. జిల్లా ఎంతో నేర్పిందని చెప్పారు.

జిల్లా అధికారుల ఆధ్వర్యంలో ఘన సన్మానం..
సిపి గౌష్ ఆలం తో పాటు జిల్లా అధికారులు అందరూ అభివృద్ధిలో తన వంతు సహకారం అందించారని వారి సహకారంతోనే జిల్లాను అన్ని రంగాల్లో తీర్చిదిద్దామని పేర్కొన్నారు. . ఈ కార్యక్రమంలో సిపి గౌష్ ఆలం, అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే లక్ష్మికిరణ్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, కరీంనగర్ హుజురాబాద్ ఆర్టీవోలు కే మహేశ్వర్, రమేష్ బాబు, అన్ని విభాగాల జిల్లా అధికారులు, టీఎన్జీవో, టీజీవో సంఘాల ప్రతినిధులు, ఎంపీడీవోలు, తహసీల్దారులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


