భారీ వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

భారీ వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

మేడిపల్లి/భీమారం (జగిత్యాల) : భారీ వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మేడిపల్లి ఎస్.ఐ శ్రీధర్ తెలిపారు. అవసరం అయితే తప్ప బయటకి రాకూడదని, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, విద్యుత్ స్థంభాలకి, విద్యుత్ పరికరాలకు దూరంగా ఉండాలని తెలిపారు. వాహనదారులు రోడ్డు మీద అత్యంత వేగంగా ప్రయాణించరాదని, రోడ్డు మీద నిలువ ఉన్న నీటి యొక్క లోతును గమనించి ప్రయాణం చేయాలని, అజాగ్రత్తగా నీటి ప్రవాహాలను దాటే ప్రయత్నం చేయవద్దని తెలిపారు. చేపలు పట్టుటకు, పశువులను మేపడానికి బయటకి వెళ్ళరాదని, గొర్ల కాపర్లు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. వర్షం సమయంలో చెట్ల కింద ఉండడం వల్ల పిడుగుపాటుకు గురయ్యే అవకాశం ఉందని అందువల్ల చెట్ల కింద ఉండరాదని తెలిపారు. రైతులు వ్యవసాయ బావుల దగ్గరికి వెళ్ళినప్పుడు కరెంటు మోటర్లతో జాగ్రత్తగా ఉండాలని, శిథిలావస్థలో ఉన్న ఇండ్లలో ఉండకూడదని, అత్యవసర సమయంలో సహాయం కొరకు డైల్ 100 ద్వారా పోలీసులను సంప్రదించవచ్చని తెలిపారు.

Views: 84

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

విద్యార్థి మండలి ఎన్నికలతో నాయకత్వ లక్షణాలకు ప్రోత్సాహం. విద్యార్థి మండలి ఎన్నికలతో నాయకత్వ లక్షణాలకు ప్రోత్సాహం.
శివ్వంపేట (మెదక్): శివంపేట మండల పరిధిలోని  పెద్దగొట్టిముక్ల ZPHS పాఠశాలలో బుధవారం విద్యార్థుల్లో చదువుతో పాటు నాయకత్వ లక్షణాలను పెంపొందించడంతో పాటు ఎన్నికల ప్రక్రియపై అవగాహన కల్పించే...
అక్రమ షట్టర్లకు పంచాయతీ నంబర్లు..!
ఎయిడ్స్ పై రెండు నెలల పాటు అవగాహన కార్యక్రమం
పరకాలలో ఘనంగా తిరంగా ర్యాలీ
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన యాప్ ద్వారా ఎరువులు కొనుగోలులు రైతులకు శాపంగా మారాయి 
మంజీరా నీటిపై చార్మినార్‌ బేవరేజెస్‌ దోపిడీ?
మాజీ ఎమ్మెల్యే ఎర్ర సత్యం వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు