మార్చి 3న కొండగట్టు అంజన్న ఆలయం మూసివేత....... చంద్రగ్రహణం దృష్ట్యా ఆలయ వేళల్లో మార్పులు

మల్యాల : మల్యాల మండలం కొండగట్టు మంగళవారం మార్చి 3, 2026 నాడు సంభవించనున్న చంద్రగ్రహణం కారణంగా కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయ ద్వారాలు తాత్కాలికంగా మూసివేయబడతాయని ఆలయ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. భక్తుల సౌకర్యార్థం మరియు గ్రహణ నియమాల దృష్ట్యా ఆలయ సమయాల్లో చేసిన మార్పుల వివరాలు ఇలా ఉన్నాయి: ఆలయ మూసివేత: మార్చి 3, 2026 (మంగళవారం) ఉదయం 7:30 గంటల నుండి సాయంత్రం 7:00 గంటల వరకు ఆలయం పూర్తిగా మూసివేయబడుతుంది. సేవల రద్దు: ఆ రోజు ఉదయం 7:00 గంటల నుండి ప్రారంభం కావాల్సిన అన్ని రకాల ఆర్జిత సేవలు రద్దు చేయబడ్డాయి. గ్రహణం విడిచిన అనంతరం, మంగళవారం సాయంత్రం 7:00 గంటలకు ఆలయ శుద్ధి, సంప్రోక్షణ మరియు ప్రత్యేక పూజా కార్యక్రమాలను అర్చకులు నిర్వహిస్తారు. బుధవారం, మార్చి 4, 2026 ఉదయం నుండి భక్తులకు యథావిధిగా స్వామి వారి సర్వదర్శనం మరియు నిత్య సేవలు అందుబాటులో ఉంటాయి. భక్తులు ఈ మార్పును గమనించి, ఆలయ అధికారులకు సహకరించవలసిందిగా కోరడమైనది. ముఖ్య గమనిక: గ్రహణ కాలంలో భక్తులెవరూ ఆలయ ప్రాంగణంలోకి అనుమతించబడరు. దర్శనం కోసం వచ్చే వారు బుధవారం ఉదయం నుండి రావలసిందిగా విజ్ఞప్తి.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


