నిజాంపేట్ సర్కిల్‌లో స్వాగత కమాన్ల ప్రారంభం

ఎన్టీఆర్ నగర్ వాసుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్

WhatsApp Image 2026-03-01 at 3.07.26 PM

 

కుత్బుల్లాపూర్  : నిజాంపేట్ సర్కిల్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్‌లో నిర్మించిన స్వాగత కమాన్లను మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్  ఆదివారం ఘనంగా ప్రారంభించారు. స్థానిక ఎన్టీఆర్ నగర్ సంక్షేమ సంఘం ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన రిబ్బన్ కట్ చేసి కమాన్లను ప్రజలకు అంకితం చేశారు. ఈ సందర్భంగా  కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ ఎన్టీఆర్ నగర్ సంక్షేమ సంఘం ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. కాలనీలో పారిశుద్ధ్యం, రహదారుల మరమ్మతులు, వీధి దీపాలు, తాగునీటి సరఫరా వంటి సమస్యలను స్థానికులు తన దృష్టికి తీసుకువచ్చినట్లు తెలిపారు. ఈ సమస్యలను సంబంధిత అధికారులతో, ప్రభుత్వంతో చర్చించి తక్షణ పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఎన్టీఆర్ నగర్ సంక్షేమ సంఘం సభ్యులు ఆయనకు శాలువాతో సత్కారం చేసి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగింది. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు ఏనుగు శ్రీనివాసరెడ్డి, ఇంద్రజిత్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, రెడ్డిపల్లి సుధాకర్, నాగార్జున, మోహన్ చౌదరి, ప్రవీణ్ చారి తదితరులు పాల్గొన్నారు. అలాగే ఎన్టీఆర్ సంక్షేమ సంఘం సభ్యులు, స్థానిక డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కాలనీ వాసులు హాజరయ్యారు. కమాన్ల ప్రారంభంతో ఎన్టీఆర్ నగర్‌కు ప్రత్యేక ఆకర్షణ ఏర్పడిందని స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు.

Views: 18

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News