ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామిని దర్శించుకున్న మంత్రి కొండ సురేఖ,ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు,మాజీ టెస్కాబ్ ఛైర్మన్ మార్నెనీ రవీందర్ రావు

హన్మకొండ : భోగి పర్వదినాన్ని పురస్కరించుకొని బుధవారం హన్మకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలో ఉన్న ప్రసిద్ధ శైవక్షేత్రం ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి కొండ సురేఖ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు,మాజీ టెస్కాబ్ ఛైర్మన్ మార్నెనీ రవీందర్ రావుతో కలిసి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.బ్రహ్మోత్సవాలకు హాజరైన మంత్రి కొండ సురేఖకు ఆలయ అధికారులు పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు మంత్రి, ఎమ్మెల్యేలకు పూర్ణకుంభంతో స్వాగతం పలికి వేదమంత్రోచ్చారణల మధ్య స్వామివారి ఆశీర్వచనాలు అందజేసి, తీర్థ–ప్రసాదాలు సమర్పించారు.ఈ సందర్భంగా మంత్రి, ఎమ్మెల్యేలు బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులకు తాగునీరు, విద్యుత్, పారిశుధ్యం, వైద్య సేవలు, భద్రత వంటి మౌలిక వసతులు సమృద్ధిగా అందుతున్నాయా లేదా అని భక్తులను అడిగి తెలుసుకున్నారు. అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు సమన్వయంతో పనిచేసి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని సూచించారు.అలాగే ఐనవోలు జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన తాత్కాలిక బస్స్టాండ్ను మంత్రి కొండ సురేఖ, ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు బస్సులో ప్రయాణించి ఏర్పాట్లను పరిశీలించారు.ఈ సందర్భంగా మంత్రి కొండ సురేఖ మాట్లాడుతూ…భోగి పర్వదినాన ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఐనవోలు ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తోందని పేర్కొన్నారు. దేవాలయాల అభివృద్ధి, బ్రహ్మోత్సవాలు, జాతరల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తోందని స్పష్టం చేశారు.బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. స్వామివారి కృపతో రాష్ట్ర ప్రజలందరికీ శాంతి, శ్రేయస్సు, సుభిక్షం కలగాలని ఆకాంక్షించారు.ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ…భోగి పర్వదినం సందర్భంగా బ్రహ్మోత్సవాల్లో పాల్గొనడం అపారమైన ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగించిందన్నారు. ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం తెలంగాణకే కాక దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ప్రాచీన శైవక్షేత్రమని తెలిపారు.ఆలయ కమిటీ, దేవాదాయ శాఖ, జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయడం అభినందనీయమన్నారు. భోగి పండుగ పాత కష్టాలను విడిచిపెట్టి కొత్త ఆశలతో ముందుకు సాగాలనే సందేశాన్ని ఇస్తుందన్నారు. స్వామివారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరికీ ఆరోగ్యం, శాంతి, సుభిక్షం కలగాలని, వర్ధన్నపేట నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలని ప్రార్థించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ టెస్కాబ్ ఛైర్మన్ మార్నెనీ రవీందర్ రావు, ఆలయ కమిటీ చైర్మన్ కమ్మగోని ప్రభాకర్ గౌడ్, ఆలయ ఈవో సుధాకర్, కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

About The Author
Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry's standard dummy text ever since the 1500s, when an unknown printer took a galley of type and scrambled it to make a type specimen book. It has survived not only five centuries, but also the leap into electronic typesetting, remaining essentially unchanged. It was popularised in the 1960s with the release of Letraset sheets containing Lorem Ipsum passages, and more recently with desktop publishing software like Aldus PageMaker including versions of Lorem Ipsum.

Related Posts

