రైతులు ఎవరు అధర్య పడవద్దు

సరిపడినంత యూరియా అందుబాటులో ఉంది : సీఈఓ రామిరెడ్డి

WhatsApp Image 2026-01-05 at 11.55.50 AM

 

సంగెం :  మండలంలోని గవిచర్ల గ్రామపంచాయతీ కార్యాలయంలో మండల వ్యవసాయ అధికారి జగదీష్ సూచన మేరకు సర్పంచ్ భాషిపాక  సదయ్య ఆధ్వర్యంలో ఆదివారం  రైతులకు యూరియా పంపిణీ టోకెన్లు పంపిణీ చేయడం జరిగింది. టోకెన్లు పంపిణీ  విధానాన్ని జిల్లా సీఈవో రామిరెడ్డి తో పాటు తహసిల్దార్ రాజకుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా సీఈవో రామిరెడ్డి  మాట్లాడుతూ రైతులు ఎవరు అధర్య పడవద్దని సరిపడినంత యూరియా అందుబాటులో ఉందని అన్నారు. గ్రామానికి కావలసినటువంటి యూరియా రైతులకు విడుదల వారీగా తెప్పించి పంపిణీ చేయడం జరుగుతుందని కావున రైతులు ఎవరు అధర్య పడవద్దు అని వారు సూచించారు. రైతులకు అవసరమైన మేరకే యూరియాని వాడాలని విజ్ఞప్తి చేశారు. రైతుల అవసరాలకు సరిపడినంత యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని అవసరమైతే తెప్పించి పంపిణీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని రైతులు అధైర్య పడాల్సిన అవసరం లేదన్నారు. కూపన్లు పంపిణీ పారదర్శకంగా జరగాలని గ్రామానికి 1400 యూరియా బస్తాలు రావడం జరిగిందని అన్నారు. టోకెన్ల పంపిణీ అనంతరం మరుసటి రోజు సోమవారం యూరియా బస్తాలను రైతులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ  పంచాయతీ కార్యదర్శులు, జిపిఓలు, వ్యవసాయ అధికారులకు సహకరించాలని సూచించారు. యూరియా కొరత రాకుండా పకడ్బందీగా ప్రణాళిక ప్రకారం మండలంలోని అన్ని గ్రామాలల సొసైటీ ఆధ్వర్యంలో యూరియా బస్తాలను రైతులకు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రైతులు ఆయా గ్రామాల్లోని వ్యవసాయ విస్తరణ అధికారులు అందుబాటులో ఉంటారని రైతులు తమ పట్టా పాసుబుక్ తీసుకొని వచ్చి యూరియా కార్డులను తీసుకోవాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. ఒక ఎకరాకు ఒక బస్తా  చొప్పున యూరియా పంపిణీ చేయాలని వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు. అనంతరం గ్రామీణ గిడ్డంగిని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మండల స్పెషల్ ఆఫీసర్ రమేష్, భూ పరీక్షల అధికారి  హేమలత, ఉప సర్పంచ్ గుమ్మడి సంపత్, వార్డు మెంబర్లు, గవిచర్ల, రామచంద్రపురం పంచాయతీ కార్యదర్శులు శరత్ కుమార్, సునిత,  ఏఈఓ సాగర్, జిపిఓ కిషోర్, వీఆర్ఏ వేణు, రైతులు, గ్రామ పంచాయతీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Views: 239

About The Author

Vision Andhra Telugu Daily Picture

Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry's standard dummy text ever since the 1500s, when an unknown printer took a galley of type and scrambled it to make a type specimen book. It has survived not only five centuries, but also the leap into electronic typesetting, remaining essentially unchanged. It was popularised in the 1960s with the release of Letraset sheets containing Lorem Ipsum passages, and more recently with desktop publishing software like Aldus PageMaker including versions of Lorem Ipsum.

Tags:

Latest News

విజయ మిల్క్ ప్రొడక్ట్స్ ను ప్రారంభించిన మధిర ఏఎంసీ చైర్మన్ బండారు విజయ మిల్క్ ప్రొడక్ట్స్ ను ప్రారంభించిన మధిర ఏఎంసీ చైర్మన్ బండారు
    మధిర : మధిర మార్కెట్ యార్డు దగ్గరలో నూతనంగా నిర్మించిన కేజేఆర్ కాంప్లెక్స్ నందు విజయ మిల్క్ ప్రొడక్ట్స్ నూతన షాపును ప్రారంభించిన మధిర మార్కెట్
మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ కు ప్రభుత్వ వెహికిల్ నిబంధనలు వర్తించవా..?
జంట గ్రామాల మెదర సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక.
భట్టి విక్రమార్క చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే టిఆర్ఎస్ నాయకుల అసత్య ప్రచారాలు
గ్రామీణ ప్రజల ఆదాయ వనరులను పెంచడమే లక్ష్యం
సిపిఐ శతాబ్ది ఉత్సవాలకు సిఎం రేవంత్ రెడ్డి గారు
మానవ అక్రమ రవాణాను అరికడుదాం : ఏ హెఛ్ టీ యూ హెడ్ కానిస్టేబుల్ అల్లిమోద్దీన్