గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పటిష్ఠం చేయడమే లక్ష్యం : నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం

మదనపల్లి గ్రామ రైతు తొడిగల సదానంద రెడ్డిని విశిష్ట సేంద్రియ రైతుగా సన్మానం

IMG-20251223-WA0074

 

వికారాబాద్  : గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా కృషి చేయాలని నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం సూచించారు. మంగళవారం వికారాబాద్ మండల పరిధిలోగల మదన్ పల్లి గ్రామంలో జాతీయ రైతు దినోత్సవం సందర్బంగా గాంధీ జ్ఞాన ప్రతిష్ఠాన్, గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ సంస్థల సమన్వయంతో తెలంగాణ రాష్ట్రంలోని నకిరేకల్‌లో మహాత్మా గాంధీ **సుస్థిర** విజ్ఞాన సదస్సు – స్వదేశీ మేళా ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమం ద్వారా గ్రామీణ వ్యవసాయ రంగంలో మహాత్మా గాంధీ ఆవలంబించిన స్వదేశీ, సుస్థిర అభివృద్ధి విలువలను విస్తృతంగా ప్రాచుర్యం చేసేందుకు ప్రత్యేక ప్రణాళికతో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది.  
ఈ సదస్సు ప్రధాన ఉద్దేశం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన సేంద్రియ వ్యవసాయ రైతులు, ప్రకృతి వ్యవసాయ పథంలో ముందంజలో నడుస్తున్న రైతుల సేవలను సత్కరించడం, వారి ఉద్యమానికి సామాజిక గుర్తింపు కల్పించడం. ఈ నేపథ్యంలో, వికారాబాద్ జిల్లాలోని వికారాబాద్ మండలానికి చెందిన మదనపల్లి గ్రామ రైతు తొడిగల సదానంద రెడ్డిని విశిష్ట సేంద్రియ రైతుగా సన్మానించడం జరిగింది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే సహజ విధానాల్లో ఆయన సాధించిన ఫలితాలను సదస్సు వేదికపై ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈ సన్మాన కార్యక్రమానికి నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం ప్రథాన అతిథిగా విచ్చేసి రైతు దినోత్సవ ప్రాముఖ్యతను వివరించారు. అలాగే తెలంగాణ రాష్ట్ర రైతు కమిషన్ అధ్యక్షులు కోదండ రెడ్డి రైతు సంక్షేమ చర్యలు, సహజ వ్యవసాయం ప్రోత్సాహానికి కమిషన్ తరఫున చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. ఆయా సంస్థల అధ్యక్షులు, ప్రతినిధులు పాల్గొని గాంధీ ఆలోచనల ఆధారంగా గ్రామీణాభివృద్ధి, సహజ వ్యవసాయం మార్గదర్శక సూత్రాలను వివరించారు.  గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ సంస్థ కోఆర్డినేటర్ పడమటి పావని, గ్లోబల్ సంస్థ చైర్మన్ గోన రాజేందర్ రెడ్డి, స్వదేశీ ఉత్పత్తుల ప్రదర్శనలు, శాస్త్రీయ చర్చల ద్వారా సుస్థిర వ్యవసాయం అవసరాన్ని నొక్కిచెప్పారు. వివిధ తెలుగు రాష్ట్రాల నుండి విచ్చేసిన సేంద్రియ రైతులు తమ అనుభవాలను పంచుకోవడంతో పాటు, స్థానిక పాఠశాలల నుండి హాజరైన విద్యార్థులకు ప్రకృతి వ్యవసాయం, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. మొత్తం కార్యక్రమం గాంధీ తత్వసారం అయిన స్వదేశీ ప్రయోజనం, గ్రామ స్వావలంబన, రైతు గౌరవం అనే లక్ష్యాలకు అంకితమై, అతి ఉత్సాహభరిత వాతావరణంలో విజయవంతంగా ముగిసింది.

Views: 13

About The Author

Vision Andhra Telugu Daily Picture

Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry's standard dummy text ever since the 1500s, when an unknown printer took a galley of type and scrambled it to make a type specimen book. It has survived not only five centuries, but also the leap into electronic typesetting, remaining essentially unchanged. It was popularised in the 1960s with the release of Letraset sheets containing Lorem Ipsum passages, and more recently with desktop publishing software like Aldus PageMaker including versions of Lorem Ipsum.

Tags:

Latest News

బాన్సువాడ ఆర్టిసి డిపోను  తనిఖీ చేసిన రీజినల్ మేనేజర్. బాన్సువాడ ఆర్టిసి డిపోను తనిఖీ చేసిన రీజినల్ మేనేజర్.
    బాన్సువాడ :  బాన్సువాడ ఆర్టీసీ డిపోను బుధవారం రీజినల్ మేనేజర్ శ్రీమతి జోష్ణ ఆకస్మికంగా  తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డిజిటల్ మేనేజర్ మాట్లాడుతూ. బాన్సువాడ
తానూర్ తహసీల్దార్ మహేందర్ నాథ్‌ను ఘనంగా సన్మానించిన కోలూర్ సర్పంచ్ ​
ఏసీబీ వలలో నందిగామ ఎంపీడీవో సుమతి
భైంసాలో 108, 102 అంబులెన్స్ సేవల తనిఖీ
విరగబూసిన గున్న మామిడి
గజ్వేల్ - ప్రజ్ఞాపూర్ 8వ వార్డులో అధ్వానంగా పారిశుధ్యం
గ్రేస్ సర్వీస్ సొసైటీ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ