ఆచార్య జయశంకర్ ఆశయాలు స్ఫూర్తిగా పనిచేయాలి
జీడబ్ల్యూఎంసీ కమిషనర్ వెంకన్న
జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన కమిషనర్
హన్మకొండ : తెలంగాణ సిద్ధాంతకర్త, మహనీయుడు ఆచార్య కొత్తపల్లి జయశంకర్ 93వ జయంతి సందర్భంగా బుధవారం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పాల్గొని ఆచార్య జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు జయశంకర్ చేసిన సేవలు, ఆయన ఆశయాలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ ఈసంపల్లి జోనా, ఎస్ఈ రాజ్కుమార్, సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, సీహెచ్ఓ లక్ష్మారెడ్డి, ఉప కమిషనర్లు బిర్రు శ్రీనివాస్, ప్రసన్నరాణి, సమ్మయ్య, కార్యదర్శి అనిల్ బాబు, ఎం హెచ్ ఓ డాక్టర్ రాజేష్, అకౌంట్స్ అధికారి శివ లింగం, సూపరింటెండెంట్ బాకం సంతోష్, అన్ని విభాగాల సిబ్బంది తదితర అధికారులు పాల్గొన్నారు.
Views: 3
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
06 Aug 2026 17:36:34
నిజామాబాద్ :నిజామాబాద్ తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రొఫెసర్ జయశంకర్ జన్మదినాన్ని పురస్క రించుకొని, నగరంలో కంటేశ్వర్ చౌరస్తా లో గల కాంస్య విగ్రహానికి, టీఎన్జీవోస్ పక్షాన పూలమాలవేసి నివాళులు...
