కారు రూపంలో వచ్చిపడిన మృత్యువు.. ప్రైవేట్ సంస్థ సూపర్వైజర్ దుర్మరణం!
గండిపేట (రంగారెడ్డి): కారు రూపంలో వచ్చిపడిన మృత్యువు.. ప్రైవేట్ సంస్థ సూపర్వైజర్ దుర్మరణం! మై హోమ్ అవతార్ జంక్షన్ సమీపంలో ఘోర ప్రమాదం నిర్లక్ష్యంగా వచ్చి ఢీకొట్టిన ఎర్టిగా కారు నర్సింగి పోలీసుల కేసు నమోదు అర్ధరాత్రి వేళ రహదారిపై కారు రూపంలో దూసుకొచ్చిన మృత్యువు ఓ ప్రైవేట్ సంస్థ ఉద్యోగి ప్రాణాలను బలిగొంది. నర్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరు తీవ్రంగా గాయపడి, ఆసుపత్రికి తరలించేసరికే మృతి చెందారు. అసలేం జరిగిందంటే..పోలీసులు మరియు స్థానికుల కథనం ప్రకారం.. రంగారెడ్డి జిల్లా, శేరిలింగంపల్లి మండలం, న్యూ హఫీజ్పేట్ ప్రాంతానికి చెందిన సోడా ప్రవీణ్ (33) ఒక ప్రైవేట్ సంస్థలో సూపర్వైజర్గా పనిచేస్తున్నారు. బుధవారం (05.08.2026) అర్ధరాత్రి సుమారు 12:25 గంటల సమయంలో ప్రవీణ్ తన హీరో ప్యాషన్ మోటార్ సైకిల్ (AP28 DX 5698) పై గచ్చిబౌలి సమీపంలోని మై హోమ్ అవతార్ జంక్షన్ నుంచి ఔటర్ రింగ్ రోడ్డు ( సర్వీస్ రోడ్డు మీదుగా వెళ్తున్నారు. ఈ క్రమంలో తీవ్ర నిర్లక్ష్యంతో, అతివేగంగా దూసుకొచ్చిన మారుతి ఎర్టిగా కారు (TG05 TP 0389) ప్రవీణ్ ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు ప్రవీణ్ బైక్పై నుంచి తీవ్రంగా కిందపడిపోవడంతో ఆయన తలకు తీవ్ర గాయాలయ్యాయి. వైద్యుల వద్దకు చేరేసరికే.. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు, పోలీసులు వెంటనే స్పందించి ప్రవీణ్ను నగరంలోని స్టార్ హాస్పిటల్కు తరలించారు. అయితే, అత్యవసర విభాగంలో పరీక్షించిన వైద్యులు ఆయన మార్గమధ్యలోనే మృతి చెందినట్లు నిర్ధారించి గా ప్రకటించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా జనరల్ హాస్పిటల్ మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై నర్సింగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన ఎర్టిగా కారు డ్రైవర్ నిర్లక్ష్యంపై చట్టపరమైన తీవ్ర చర్యలు తీసుకోనున్నట్లు పోలీసులు తెలిపారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


