ఘనంగా ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 92వ జయంతి వేడుకలు
చౌటకూర్, : సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో గురువారం తెలంగాణ సిద్ధాంతకర్త, తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిన మహనీయుడు ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 92వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తహసిల్దార్ నామాల కృష్ణయ్య, ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం అధికారులు మాట్లాడుతూ. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రొఫెసర్ జయశంకర్ చేసిన సేవలను స్మరించుకున్నారు. తెలంగాణ ప్రజల్లో ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను బలపరుస్తూ ఉద్యమానికి సిద్ధాంతపరమైన దిశానిర్దేశం చేసిన ఆయన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో జయశంకర్ సార్ పోషించిన పాత్రను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని, తెలంగాణ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ఆయన కలలుగన్న ఆశయాలను సాకారం చేసే దిశగా అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆయన ఆలోచనలు నేటి తరానికి నిరంతరం స్ఫూర్తిగా నిలుస్తాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శంకర్, ఎంపీఓ పి. సువర్ణ, పంచాయతీ కార్యదర్శి సందీప్గౌడ్, తహసిల్దార్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Views: 30
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
06 Aug 2026 17:36:34
నిజామాబాద్ :నిజామాబాద్ తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రొఫెసర్ జయశంకర్ జన్మదినాన్ని పురస్క రించుకొని, నగరంలో కంటేశ్వర్ చౌరస్తా లో గల కాంస్య విగ్రహానికి, టీఎన్జీవోస్ పక్షాన పూలమాలవేసి నివాళులు...
