పని హక్కుపై బిజెపి ప్రభుత్వం చేస్తున్న దాడిని ప్రతి వ్యక్తి ఖండించాలి..


WhatsApp Image 2026-01-10 at 1.47.53 PM

 

సూర్యాపేట : ప్ర‌ధాని మోదీ ప్రభుత్యం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005 ను రద్దు చేసి జి రాం జి 2025 పేరుతో 197 బిల్లును తీసుకురావడాన్ని తీవ్రంగా ఖండిస్తున్న‌ట్లు,ఈ ప్రతిపాదనను విరమించుకోవాలని,పని హక్కుపై బిజెపి ప్రభుత్వం చేస్తున్న దాడిని ప్రతి వ్యక్తి ఖండించాలని డిసిసి అథ్యక్షులు గుడిపాటి నర్సయ్య అన్నారు.శనివారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జాతీయ స్వతంత్ర పోరాటంలో అహింసా మార్గంలో పోరాటం చేసి సత్యాగ్రహమే ఆయుధంగా బ్రిటిష్ పాలనపై పోరాటం చేసిన  జాతిపిత మహాత్మా గాంధీ పేరును ఉపాధి హామీ పథకం నుండి తొలగించి విజి రాంజీ అనే కొత్త పేరు పెట్టడమే కాకుండా పధకం యొక్క ముఖ్య ఉద్దేశ్యం దెబ్బతీసే  విధంగా చేస్తూ బిజెపి ప్రభుత్వం కుట్రలకు పాల్పడుతుందని ఆయన అన్నారు.యూపీఏ ప్రభుత్వంలో సోనియాగాంధీ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టారని, గ్రామీణ ప్రాంతాల ప్రజలు పట్టణాలకు వలసలు పోకుండా, వారు నివసించే గ్రామంలోనే పని కల్పించే విధంగా పార్లమెంట్లో చట్టం చేసి ప్రతి రాష్ట్ర ప్రభుత్వం కూడా అమలు చేసే విధంగా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొని వచ్చిందని ఆయన అన్నారు.  కానీ బీజేపీ ప్రభుత్వం  కేంద్రం 60శాతం రాష్ట్రం 40శాతం నిధులు భరించాలనే మార్పులు చేయడం వల్ల ఈ పథకాన్ని రాష్ట్రాలకు భారంగా మారి రద్దు చేసే అవకాశం ఉందని  అన్నారు.   కార్పొరేటు సంస్థలకు  మేలు చేసే విధంగా గ్రామీణ కూలీలు పట్టణాలకు వలస పోయే విధంగా కేంద్రం పథకంలో మార్పులు చేసిందని ఆయన అన్నారు.  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు పిసిసి ఆదేశాల మేరకు జనవరి 20 నుంచి  మోడి ప్రభుత్వం యొక్క కుట్రలకు వ్యతిరేకంగా సూర్యాపేట జిల్లాలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన అన్నారు.  ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామీణ కూలీలు పెద్ద సంఖ్యలో పాల్గొని పథకాన్ని తిరిగి తీసుకొని వచ్చేవరకు ఈ పోరాటాన్ని కొనసాగించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో పిసిసి ప్రధాన కార్యదర్శి చకిలం రాజేశ్వర్ రావు, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అంజద్ అంజలి, మాజీ ఫ్లోర్ లీడర్ కక్కిరేణి శ్రీనివాస్, ఎస్సీ సెల్ రాష్ట్రనాయకులు చింతమల్ల రమేష్, నాగుల వాసు, కుమ్మరికుంట్ల వేణుగోపాల్, రావుల రాంబాబు,అక్కినపల్లి జానయ్య, పిడమర్తి నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.

Views: 2

About The Author

Vision Andhra Telugu Daily Picture

Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry's standard dummy text ever since the 1500s, when an unknown printer took a galley of type and scrambled it to make a type specimen book. It has survived not only five centuries, but also the leap into electronic typesetting, remaining essentially unchanged. It was popularised in the 1960s with the release of Letraset sheets containing Lorem Ipsum passages, and more recently with desktop publishing software like Aldus PageMaker including versions of Lorem Ipsum.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

మంత్రి శ్రీధర్ బాబు పై విమర్శలు చేస్తే సహించం.. మంత్రి శ్రీధర్ బాబు పై విమర్శలు చేస్తే సహించం..
    జయశంకర్ భూపాలపల్లి : భగ్గుమన్న మహాదవపూర్ కాంగ్రెస్ మండల నాయకులు మంత్రి శ్రీధర్ బాబు పై విమర్శలు చేయడం చాలా బాధాకరం ఇలాంటి విమర్శలు చేస్తే
ఆరు దశాబ్దాల వేడుక విజ్ఞాన దీపిక
ములుగు జిల్లా కాంగ్రెస్ ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొన్న మంత్రి సీతక్క ..
గట్టమ్మ తల్లి ఆలయాన్ని సందర్శించిన వరంగల్ న్యాయమూర్తి ఎం సాయి కుమార్.
టైలర్స్ అసోసియేషన్ భవన నిర్మాణానికి భూమిపూజ
కల్వకుర్తి జిల్లాను ఏర్పాటు చేయాలి ఊరుకొండను కల్వకుర్తి డివిజన్‌లోనే కొనసాగించాలని జేఏసీ నిరసన దీక్షలు
జహీరాబాద్‌లో విజన్ఆంధ్ర 2026 క్యాలెండర్ ఆవిష్కరణ