ఆర్.వి.యం హాస్పిటల్లో డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి జన్మదిన వేడుకలు
- రక్తదాన శిబిరం నిర్వహణ.. రోగులకు పండ్లు, బ్రెడ్డు పంపిణీ
సిద్దిపేట జిల్లా/గజ్వేల్ : చేవెళ్ల మాజీ పార్లమెంట్ సభ్యులు, ఆర్.వి.యం హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి జన్మ దినాన్ని పురస్కరించుకుని శుక్రవారం సిద్దిపేట జిల్లా, ములుగు మండలం, లక్ష్మక్కపల్లి గ్రామంలోని ఆర్.వి.యం హాస్పిటల్ నందు ఉదయం 9.00 గంటలకు రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరంలో వైద్య విద్యార్థిని విద్యార్థులు, పారామెడికల్ సిబ్బంది, ఆస్పత్రి ఉద్యోగులు, డాక్టర్ రంజిత్ రెడ్డి అభిమానులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, చుట్టుపక్కల గ్రామీణ, పట్టణ ప్రాంత ప్రజలు అత్యంత ఉత్సాహంతో పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. జన్మదిన వేడుకల్లో భాగంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు బ్రెడ్, పండ్లను పంపిణీ చేసి, డాక్టర్ రంజిత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్.వి.యం హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్, డీన్ ఓ. శ్రావణ్ కుమార్, డైరెక్టర్లు పి. రాజేందర్, డాక్టర్ గోపికృష్ణ, రవీందర్ గౌడ్, సీఈఓ దేవరకొండ శ్రీనివాస్, బ్లడ్ బ్యాంక్ ఇన్ఛార్జ్ రాజ్కుమార్, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


