డబుల్ బెడ్ రూమ్ డ్రా పద్ధతి ద్వారా అన్యాయం జరిగింది.
సిపిఎం పార్టీ మండల కార్యదర్శి బొడ్డు కరుణాకర్
డబుల్ బెడ్ రూమ్ నివాసం ఉంటున్న వారికి కేటాయించాలని డిమాండ్
లింగాల గణపురం (జనగాం) : లింగాల గణపురం మండల కేంద్రంలోని కళ్లెం గ్రామంలోలేని నిరుపేదలు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో ఆరు సంవత్సరాల నుండి నివాసం ఉంటున్నారు దళిత కుటుంబాలకు చెందినవారు రోజువారి కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు వారికి కూలి పనులకు వెళ్లకపోతే కుటుంబం గడిచే పరిస్థితి లేదు వారికి ఎలాంటి ఆస్తులు గాని వ్యవసాయ భూములు గాని లేవు అట్టి ఇండ్లలో కరెంటు సౌకర్యం లేకపోయినా జీవనం సాగిస్తున్నారు వారు ఉంటూనే ఇండ్లలో కొంతవరకు ఇంకుడు గుంతలు గాని లాటరీస్ బాత్రూంలో గాని మరమ్మతులు చేసుకున్నారు కానీ కలెక్టర్ ఆఫీసులో డ్రా పద్ధతిని తీయడంలో వారికి అన్యాయం జరిగింది మాకు న్యాయం జరగాలని అంబేద్కర్ స్టాచ్ ముందు రోడ్డు పైన రాస్తారోకో నిర్వహించారు మాకు న్యాయం జరిగేంత వరకు ఇండ్లలో నుండి వెల్లబోమని అన్నారు డ్రా పద్ధతిని సమగ్ర విచారణ జరిపి డబుల్ బెడ్ రూమ్ లో ఉంటున్న వారికి వారికే కేటాయించాలని అన్నారు కేటాయించని ఎడల దశలవారీగా పోరాటాలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు వారికి న్యాయం జరిగేంతవరకు పేదల పక్షాన ఉండి పోరాటాన్ని ఉధృతం చేస్తామని డిమాండ్ ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు గోసంగి శంకరయ్య మబ్బు ఉప్పలయ్య తూటి దేవదానం డబుల్ బెడ్ రూమ్ కాలనీవాసులు దుక్కిపాటి మేరీ కానుగంటి విజయ మేడ శోభ సిరిగిరి సుజాత సిరిగిరి నరసమ్మ సిరిగిరి ఐలయ్య రజిత రోజా కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


