ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్ కాపీల పంపిణీ
ముస్తాబాద్, :రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామంలో శుక్రవారం ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులకు ప్రొసీడింగ్ కాపీలను ఘనంగా పంపిణీ చేశారు. గ్రామ సర్పంచ్ పెద్దిగారి యాదమ్మ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అర్హులైన లబ్ధిదారులకు ప్రొసీడింగ్ కాపీలను అందజేసి, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు అనమేని రాజు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు మామిండ్ల ఆంజనేయులు, మెరుగు కిరణ్ కుమార్, కేసుగాని చంద్రమౌళి, మాజీ ఎంపీటీసీ కొండని బాలకిషన్, వార్డు సభ్యుడు జంగ రాజు, ఎన్నారై జిల్లా అధ్యక్షుడు తోట ధర్మేందర్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు తలారి నరసయ్య, పంచాయతీ కార్యదర్శి దేవరాజు,విద్యాధర్, మాధవరావు తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా లబ్ధిదారులు ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా సొంత ఇంటి కల నెరవేరనున్నందుకు ఆనందం వ్యక్తం చేశారు.
Views: 8
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
17 Jul 2026 18:28:46
మర్పల్లి,(వికారాబాద్): మండలంలో వర్షాభావ పరిస్థితులు రోజురోజుకూ తీవ్రరూపం దాల్చడంతో అన్నదాతల ఆవేదన తారాస్థాయికి చేరుకుంది. సకాలంలో వర్షాలు కురవకపోవడంతో రైతులు ఎంతో ఆశతో సాగు చేసిన పత్తి,...
