ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఉద్యమ కార్యాచరణ : టి ఎన్ జి ఓ అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్

నిజామాబాద్ : ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి నిర్వహించబోయే ఉద్యమ కార్యాచరణలో తామందరూ కలిసి ఉద్యమాన్ని నడిపించాలని టిఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్ అన్నారు. గురువారం టిఎన్జీవో జిల్లా కార్యాలయం నందు స్వర్గీయ శ్రీ బి స్వామినాథం సమావేశ మందిరంలో నీటిపారుదల శాఖ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పందిరి స్వామి, కె.పి. సునీతల అధ్యక్షతన ఏర్పాటు చేసిన నీటిపారుదల శాఖ ఉద్యోగుల సంఘం సర్వసభ్య సమావేశానికి ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా చైర్మన్, టిఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్, టిఎన్జీవో జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్, నీటిపారుదల శాఖ ఉద్యోగుల సంఘం అడాక్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ సంఘం లక్ష్మణరావు, రాష్ట్ర కో కన్వీనర్ నజీర్ అహ్మద్, టిఎన్జీవో రాష్ట్ర ఉపాధ్యక్షులు గైని గంగారం, రాష్ట్ర కార్యదర్శి పూల శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా సుమన్ కుమార్ మాట్లాడుతూ 2025–26 సంవత్సరానికి గాను నీటిపారుదల శాఖ ఉద్యోగుల ఐక్యతను అభినందిస్తూ ఉద్యోగస్తుల సమస్యల పరిష్కారానికి టిఎన్జీవో సంఘం వెంట నడవాలని కోరారు. త్వరలో టిఎన్జీవో రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మారం జగదీశ్వర్, ఎస్.ఎం. హుసేనీల ఆధ్వర్యంలో నిర్వహించబోయే ఉద్యమ కార్యాచరణకు అందరూ కలిసికట్టుగా రావాలని పిలుపునిచ్చారు. అనంతరం సిట్టింగ్ రాష్ట్ర నీటిపారుదల శాఖ నిజామాబాద్ జిల్లా ఉద్యోగులను అభినందించి, భవిష్యత్తులో టిఎన్జీవో ఆధ్వర్యంలో నిర్వహించే ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులకు మద్దతుగా నిలిచి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి అండగా ఉండాలని తెలిపారు.
అనంతరం నీటిపారుదల శాఖ ఉద్యోగుల సంఘం 2025–26 సంవత్సరానికి నిర్వహించే జిల్లా ఎన్నికలకు ఎన్నికల అధికారిగా వ్యవహరించిన టిఎన్జీవో సలహాదారులు వనమాల సుధాకర్ మాట్లాడుతూ అన్ని పదవులకు సింగిల్ సెట్ నామినేషన్లు రావడంతో ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగినట్లు ప్రకటించారు. జిల్లా అధ్యక్షులుగా కే. జనార్దన్, జిల్లా కార్యదర్శిగా సామ్యూల్ వెస్లీ, కోశాధికారిగా ఇక్బాల్, సహాధ్యక్షులుగా శ్రీనివాస్ మోరే, ఉపాధ్యక్షులుగా వెంకటరమణారెడ్డి, జగన్మోహన్, వసంత, సంయుక్త కార్యదర్శులుగా సంపత్, మల్లయ్య, సమంత, ఆర్గనైజింగ్ సెక్రటరీగా బి. జయరాజ్, ప్రచార కార్యదర్శిగా జి. శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులుగా అజీమ్, ఆశయ్య, చిన్న గంగారం, చెన్న శివరాజ్ తదితరులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలిపారు.
About The Author
Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry's standard dummy text ever since the 1500s, when an unknown printer took a galley of type and scrambled it to make a type specimen book. It has survived not only five centuries, but also the leap into electronic typesetting, remaining essentially unchanged. It was popularised in the 1960s with the release of Letraset sheets containing Lorem Ipsum passages, and more recently with desktop publishing software like Aldus PageMaker including versions of Lorem Ipsum.


