రేవంత్ రెడ్డి సర్కార్ హామీల అమలులో విఫలమైంది. మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్.
బాన్సువాడ: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఏర్పడి 1000 రోజులు పూర్తవుతున్న ఇచ్చిన హామీల అమల్లో పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే టిఆర్ఎస్ బాన్సు నియోజకవర్గం ఇన్చార్జి బాజిరెడ్డి గోవర్ధన్ తీవ్రంగా విమర్శించారు. ఈ సందర్భంగా బాన్సువాడ అంబేద్కర్ చౌరస్తాలో భారత రాష్ట్ర సమితి పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో ఆయన ముఖ్య పాల్గొని మాట్లాడారు. ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం..... టిఆర్ఎస్ నాయకులు మోరల్ శ్రీనివాసరావు.బాన్సువాడ నియోజకవర్గం లోని ఆయా ఆయా మండల కేంద్రాలు, గ్రామాల నుంచి భారత రాష్ట్ర సమితి నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యల తరలివచ్చి ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాజిరెడ్డి గోవర్ధన్, సీనియర్ నాయకులు శ్రీనివాసరావు మాట్లాడుతూ. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి రావడం జరిగిందని వచ్చిన తర్వాత వాటిని అమలు చేయడంలో పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుందని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా నమ్మి ఓటు వేసిన ప్రజలను మోసం చేస్తున్నారని ఆవేదన చెందారు. ఆరు గ్యారెంటీలను అమలు ప్రభుత్వము విఫలమైందని అన్నారు. మహిళలకు ప్రతినెల 2500 చెల్లిస్తానని వాగ్దానం చేసి ఇప్పటికీ అమలు చేయలేదని గుర్తు చేశారు. రైతన్నలకు రుణమాఫీ చేస్తానని చెప్పి కొందరికే రుణమాఫీ చేసి చేతులు దులుపుకున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రజలు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం ఓటు ద్వారా చెప్పి బొంద పెడతార ని సీనియర్ నాయకులు మోరల్ శ్రీనివాసరావు జోష్యం చెప్పారు. ఈ కార్యక్రమం లో భారత రాష్ట్ర సమితి నాయకులు అంజిరెడ్డి, జుబేర్, మోచి గణేష్, వార్డ్ నెంబర్లు సలీం ఆయా మండలానికి చెందిన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


