వరద సహాయక చర్యల కోసం జిల్లాలకు ముందస్తుగా కోటి రూపాయలు విడుదల : మంత్రి పొంగులేటి

వరదల్లో ప్రాణ నష్టం సంభవించకుండా పట్టిష్ట చర్యలు :
రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన మంత్రి

 
 వరదల్లో ప్రాణ నష్టం సంభవించకుండా పట్టిష్ట చర్యలు :  మంత్రి పొంగులేటి

 ఉమ్మడి కరీంనగర్ (విజన్ ఆంధ్ర) :  వరదల్లో ప్రాణ నష్టం సంభవించకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్టిష్ట చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా గురువారం రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి  ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. భారీ వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, యూరియా నిల్వల పై  మంత్రి సమీక్షించారు.  వాతావరణ శాఖ సూచనల ప్రకారం రాష్ట్రంలో అల్పపీడనం వల్ల కురిసే భారి నుంచి అతి భారీ వర్షాల వల్ల ఎక్కడ ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని, రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హైదరాబాద్ సచివాలయం నుంచి భారీ వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, యూరియా నిల్వల పై సీఎస్ కే. రామ కృష్ణా రావు తో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.  ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఉమ్మడి జిల్లాల కలెక్టరేట్ నుంచి జిల్లాల కలెక్టర్లు పమేలా సత్పతి, సందీప్ కుమార్ ఝా, కోయ శ్రీహర్ష, బి. సత్య ప్రసాద్, ఐఏఎస్ లు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ....2 రోజుల నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు రాష్ట్రంలోనే కొన్ని ప్రాంతాలలో కురుస్తున్నాయని తెలిపారు. వాతావరణ శాఖ సూచనల ప్రకారం వరదల సమయంలో ఆస్తి, ప్రాణ నష్ట నివారణకు చర్యలు చేపట్టాలని అన్నారు. వరద పరిస్థితుల పై ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని, ప్రజలకు ఎక్కడ ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని అన్నారు. వరద సహాయక చర్యలు చేపట్టేందుకు రాష్ట్రవ్యాప్తంగా జిల్లాలకు ముందస్తుగా కోటి రూపాయలను ప్రభుత్వం విడుదల చేసిందని, అవసరమైతే మరిన్ని నిధులు కూడా విడుదల చేస్తామని స్పష్టం చేశారు. వరదల వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం అందించేందుకు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపాలని కలెక్టర్లకు ఆదేశించారు. వరద సహాయక చర్యల్లో పోలీసు యంత్రాంగం సహకారం పూర్తిస్థాయిలో తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. 
 
సిఎస్ కే.రామ కృష్ణా రావు మాట్లాడుతూ....వాతావరణ శాఖ సూచన ప్రకారం తూర్పు, దక్షిణ ప్రాంతాలలో రెడ్ అలర్ట్ జారీ చేసిందని అన్నారు. మిగిలిన ప్రాంతాలలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపిందని అన్నారు. వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, జిల్లాలో అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. జిల్లాలో కలెక్టర్ వద్ద ఉన్న డిజాస్టర్ నిధులను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని సీఎస్ సూచించారు. వరద అంచనా వేస్తూ, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అన్నారు. రాష్ట్రంలో ఎక్కడ ప్రాణ నష్టం జరగకుండా అధికారులు పనిచేయాలని సిఎస్ ఆదేశాలు జారీ చేశారు. ఉదృతంగా ప్రవహించే వాగులు, చెరువుల సమీపంలో గల రోడ్లు, కల్వర్టు , వంతెనలను మూసి వేయాలని అన్నారు. పట్టణ ప్రాంతాలలో కొన్ని కాలనీ లలో ఇండ్లకు నీళ్లు వచ్చే అవకాశం ఉందని, అక్కడ అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకోవాలని, ప్రజల అవసరమైతేనే బయటకు రావాలని అన్నారు. రాష్ట్రంలో వర్షాలు పడుతున్న నేపథ్యంలో సాగు విస్తీర్ణం పెరుగుతుందని, రైతులకు అవసరమైన యూరియా నిల్వలు అందుబాటులో పెట్టాలని, ఎక్కడ ఎటువంటి లోటు పాట్లు ఉండకుండా చూసుకోవాలని అన్నారు.  ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఉమ్మడి జిల్లాల అదనపు కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Views: 0

About The Author

Vision Andhra Telugu Daily Picture

Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry's standard dummy text ever since the 1500s, when an unknown printer took a galley of type and scrambled it to make a type specimen book. It has survived not only five centuries, but also the leap into electronic typesetting, remaining essentially unchanged. It was popularised in the 1960s with the release of Letraset sheets containing Lorem Ipsum passages, and more recently with desktop publishing software like Aldus PageMaker including versions of Lorem Ipsum.

Tags:

Latest News