మల్యాల బిసి హాస్టల్ విద్యార్థుల మృతిపై బిఎస్పి దిగ్భ్రాంతి
బాధ్యులపై చర్యలు తీసుకోవాలి: బిఎస్పి పార్లమెంట్ ఇంచార్జ్ చిర్ర శంకర్
మల్యాల : జగిత్యాల జిల్లా మల్యాల మండల బిసి హాస్టల్లో ఇద్దరు విద్యార్థులు మృతి చెందడంపై బిఎస్పి పార్లమెంట్ ఇంచార్జ్ చిర్ర శంకర్ తీవ్ర సంతాపం తెలిపారు. మంగళవారం పార్టీ నాయకులతో కలిసి ఆయన హాస్టల్ను సందర్శించి, మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చిర్ర శంకర్ మాట్లాడుతూ... ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకు బిఎస్పి తరఫున సానుభూతి తెలిపారు. చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు ₹25 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి. 5 ఎకరాల భూమి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేయాలి. ఈ కార్యక్రమంలో బిఎస్పి సీనియర్ నాయకులు తాళ్ల తిరుపతి, మునుగురి అజయ్, ముప్పారపు రవీందర్, జాలిగాపు చందు తదితరులు పాల్గొన్నారు.
Views: 7
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
04 Aug 2026 18:44:58
మందమర్రి, (మంచిర్యాల) : జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు,ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలలో వేగం పెంచి అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ ఫలాలు అందేలా సమన్వయంతో కృషి చేయాలని...
