మర్పల్లిలో రేపు మండల స్థాయి సమీక్ష సమావేశం
అభివృద్ధి పనులపై కీలక సమీక్ష ;ఎంపీడీవో శాంతమ్మ
మర్పల్లి,(వికారాబాద్): మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మంగళవారం ఉదయం 10 గంటలకు మండల స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో శాంతమ్మ సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశానికి మండలంలోని అన్ని గ్రామాల సర్పంచులు, గ్రామపంచాయతీ కార్యదర్శులు, వివిధ శాఖల డివిజన్ అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని ఆమె సూచించారు. మండల అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాల అమలు, గ్రామాల వారీగా పెండింగ్ అంశాలపై సమీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సమావేశానికి సంబంధిత అధికారులు సమయానికి హాజరై అవసరమైన వివరాలతో రావాలని ఎంపీడీవో శాంతమ్మ కోరారు.
Views: 0
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
04 Aug 2026 18:44:58
మందమర్రి, (మంచిర్యాల) : జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు,ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలలో వేగం పెంచి అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ ఫలాలు అందేలా సమన్వయంతో కృషి చేయాలని...
