సాలార్ నగర్ రైతులు భూ భారతి సర్వే కోసం తాసిల్దార్ కు వినతి పత్రం అందజేత.
భూ భారతి పైలెట్ ప్రాజెక్టు సర్వేలో లోపాలు
గండీడ్, :గండీడ్ మండల పరిధిలోని సాలార్ నగర్ గ్రామపంచాయతీ పరిధిలో రైతుల భూముల భారతి పైలెట్ ప్రాజెక్టు ఎంపిక తో భూ సర్వే చేయడం జరిగింది. ఇందులో భాగంగా సుమారుగా 70 మంది భూముల యొక్క రైతుల భూముల కొలతలు, సర్వే లోపాలు అవకతవకలు ఉండడంతో రైతులు ఆందోళన చెంది తమకు రీ సర్వేచేసి న్యాయం చేయాలని తహసిల్దార్ కు గ్రామ పెద్దలు, గ్రామస్తులు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఆంజనేయులు గౌడ్, మాజీ జెడ్పిటిసి శ్రీనివాస్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ ఈశ్వరయ్య గౌడ్, చెన్నారెడ్డి మాధవరెడ్డి కృష్ణయ్య, గ్రామ ప్రజలు గ్రామ రైతులు తదితరులు పాల్గొనడం జరిగింది
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


