కన్నీటి వర్షం ఇల్లు కూలి వీధిన పడ్డ నిరుపేద కుటుంబం
పోలు పద్మ కుటుంబాన్ని అధికారులు ఆదుకోవాలని విన్నపం
హుస్నాబాద్ : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం తోటపల్లి గ్రామంలో పోలు పద్మ భర్త రాజయ్య హనుమాన్ గుడి వద్ద పెంకుటిల్లులో నివాసం ఉంటున్నారు. మొన్నటిరెండు రోజుల వర్షాలకు గోడలు మొత్తం తడిసి మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు ఇల్లు కూలడం జరిగిందని ఇంట్లో సామాగ్రి మొత్తం దెబ్బతిందని, సర్వస్వం కోల్పోయామని నిలువ నీడ లేకుండా లేకుండా మిగిలిపోయామని, కూలిపోయిన ఇల్లును చూపిస్తూ పోలు పద్మ ఆవేదనతో విలపిస్తూ తెలిపింది.ఈ సందర్బంగా ఇలాంటి విపత్కర పరిస్థితిలో ఇల్లు కూలిపోయిన నిరుపేదరాలు పోలు పద్మ కుటుంబాన్ని సందర్శించి ఆదుకోవాలని సర్పంచ్ బంక లక్ష్మి చందు, గ్రామస్తులు అధికారులను కోరారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Related Posts

