ఇండ్ల స్థలాలను పరిశీలించిన తహసీల్దార్
నాంపల్లి మండల పరిధిలోని సుంకిశాల గ్రామంలో గత నాలుగు రోజులుగా పాత ఊరు ఇండ్ల స్థలాల రిజిస్ట్రేషన్ ను రద్దు చేయాలని గ్రామస్తులు చేస్తున్న నిరసన దీక్షకు, మంగళవారం నాంపల్లి తహశీల్దార్ అంబటి ఆంజనేయులు సంఘటన స్థలానికి చేరుకొని గ్రామ ప్రజలతో చర్చించి ఇండ్ల స్థలాలను పరిశీలించారు. ఇట్టి విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి, మీకు న్యాయం చేపిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. దీంతో తహశీల్దార్ హామీతో దీక్షను విరమింప చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బాషిపాక రాములు, వార్డు సభ్యులు కలకొండ లక్ష్మయ్య, బుడిగపాక ధనమ్మ , వాడపల్లి లావణ్య, నేరేడుగోమ్ము సత్యనారాయణ, కాటిక ఇదెమ్మ, ఎడమ మల్లేష్, ఆంజనేయులు, దేవేందర్, హరీష్, కిరణ్, రమేష్, ఎర్రయ్య, లింగయ్య, తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


