బిజెపి ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు:
జాతీయ జెండా ఆవిష్కరించిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం
కరీంనగర్, : కరీంనగర్ బీజేపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో శనివారం రోజు పంద్రాగస్టు స్వాతంత్ర్య వేడుకలను కరీంనగర్ పార్లమెంట్ కార్యాలయం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొని దేశభక్తి గీతాలు, 'భారత్ మాతా కీ జై' నినాదాలు చేశారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం మాట్లాడుతూ.. ప్రజలందరికీ 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశ అభ్యున్నతి కోసం, భవిష్యత్తు తరాల ఉజ్వల భవిష్యత్తు కోసం ఐక్యంగా ఉండి ముందుకు కొనసాగాలని తెలిపారు. . 'వికసిత్ భారత్' లక్ష్యంగా దేశం ముందుకెళ్తోందని, ఈ ప్రయాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ వై. సునీల్ రావు, మాజీ డిప్యూటీ మేయర్ జి. రమేష్, మాజీ ఎమ్మెల్యే శోభక్క, మాజీ అధ్యక్షుడు బాస సత్యనారాయణ రావు , 50వ డివిజన్ కార్పొరేటర్ బోయినపల్లి ప్రవీణ్ రావు, మీడియా సెల్ కన్వీనర్ కటకం లోకేశ్, ఉప్పర పల్లి శ్రీనివాస్ , కార్పొరేటర్లు, బిజెపి రాష్ట్ర ,జిల్లా నాయకులు కార్యకర్త లు ,వివిధ మోర్చా బాధ్యులు, మండల, నగర జోన్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.
Views: 3
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
15 Aug 2026 14:09:55
స్వాతంత్ర్య వేడుకల్లో ప్రతిభకు ఘన సత్కారం
దేశభక్తి స్ఫూర్తితో.. విద్యార్థుల భవిష్యత్తుకు బాట
ప్రతిభను ప్రోత్సహించడమే లక్ష్యం.. సంతోష్ యాదవ్ ప్రత్యేక చొరవ
