చిల్లీస్ బార్ లో చిల్లర వ్యాపారం..!!
కాలం చెల్లిన ఆహార పదార్థాల సరఫరా

ప్రశ్నిస్తే దాడికి ప్రయత్నం..!!
కామారెడ్డి : చిల్లీస్ బార్ అండ్ రెస్టారెంట్ అని గొప్ప పేరు పెట్టుకొని... అందమైన డెకరేషన్ లతో ఆకట్టుకునేలా చేసి అందులో మాత్రం చిల్లర వ్యాపారం చేస్తున్నారని మాజీ సిడీసీ చైర్మన్, మాజీ సర్పంచి, దోమకొండ సొసైటీ మాజీ చైర్మన్, కామారెడ్డి మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ ఐరేని నర్సయ్య ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన బుదవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... చిల్లీస్ బార్ అండ్ రెస్టారెంట్ వారి దౌర్జన్యం ఎక్కువైందని దానికి తామే సాక్ష్యమని వివరించారు. ఈ నెల 9 న తనతో కలిసి రెస్టారెంట్ వెళ్లామని అక్కడ రెస్టారెంట్ లో తినే ఆహారపదార్థాలకు సంబందించి ఆర్డర్ ఇచ్చామన్నారు. అయితే అందులో పూర్తిగా కాలం చెల్లిన గుడ్లు, ఇతర నిల్వ ఉంచిన పదార్థాలతో వంటలు చేస్తున్నట్లు గమనించినట్లు తెలిపారు. తాము ఆర్డర్ చేసిన ఫుడ్ పాచిపోయినట్లు వాసన రావడంతో అనుమానం వచ్చి ప్రశ్నించినట్లు తెలిపారు. అయితే అలా ప్రశ్నించినందుకు చిల్లీస్ బార్ అండ్ రెస్టారెంట్ వారు అందులో మేనేజర్ గా వ్యవహరించే లక్ష్మిపతితో పాటు పలువురు దురుసుగా ప్రవర్తించి దాడి చేసేంత పని చేశారని పేర్కొన్నారు. ఇదంతా సీసీ కెమెరాలో కూడా ఉంటుందని తెలిపారు.
చిల్లీస్ బార్ పై చర్యలు తీసుకోవాలి
హోటళ్లు వ్యాపార సంస్థలు కస్టమర్లే దేవుళ్లు అంటూ బోర్డులు పెడుతూ ... మరో పక్క ఇలా కల్తీ ఆహార పదార్థాలు అందజేస్తూ రోగాల పాలు చేసేలా చేయడం సిగ్గు చేటన్నారు. ఈ విషయాన్ని అడిగితే తమపట్ల దుర్భాషలాడారని మీడియా సమావేశంలో వెల్లడించారు. ఇదే విషయాన్ని వెంటనే స్థానిక పోలీసుసలకు సైతం వివరించినట్లు ఆయన తెలిపారు. కాగా ఇటువంటి అక్రమ చిల్లర, కల్తీ వ్యాపారాల వల్ల ప్రజల ప్రాణాలు గాలిలో కలిసే అవకాశం ఉందన్నారు. రోజు రోజుకు ఇటువంటి వ్యాపార సంస్థల వారి ఆగడాలు ఎక్కువ అవుతున్నాయన్నారు. చిల్లీస్ బార్ లో కూడా లభించే మద్యం కూడా కల్తీ చేస్తున్నారేమో అనుమానం కలుగుతుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. అలాగే ఈ బార్ లో మద్యాన్ని అధిక ధరకు ఇష్టానుసారంగా విక్రయాలు చేస్తున్నారన్నారు. కామారెడ్డిలో ఇటువంటి సంస్థలపై సంబందిత అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఫుడ్ తనిఖీ చేసే అధికారులు మరింత ముమ్మరంగా తనిఖీలు చేయాలని కోరారు. అలాగే వ్యాపార సంస్థల నిర్వాహణకు సంబందించిన నియమ నిబంధనలు తెలిపే సమాచార బోర్డును సైతం ఏర్పాటు చేయాలన్నారు. అటువంటి నిబందనలు పాటించకుండా .. అందంగా అలంకరించిన అందమైన పేర్లతో ఆకట్టుకుంటూ చిల్లర వ్యాపారం చేయడం మంచిది కాదన్నారు. తాను తనతో పాటు ఉన్న సహచరుల మద్యలో అందరూ చూస్తుండగా దుర్భాషలాడుతూ దాడికి దిగడం సిగ్గు చేటన్నారు. ఇటువంటి వ్యాపార సంస్థలపై అధికారులు ఎప్పటికప్పుడు నిఘా ఉంచాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే చిల్లీస్ బార్ అండ్ రెస్టారెంట్ పై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని వెంటనే ఆ బార్ ను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. తమకు జరిగిన ఘోరాన్ని పోలీసులకు వివరించామని తెలిపారు.
కామారెడ్డి టౌన్ సీఐ నరహరిని విజన్ ఆంధ్ర ప్రతినిధి ముదాం శంకర్ పటేల్ వివరణ కోరగా స్మోక్ విషయంలో చిన్న సమస్యతో ఒకరిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అలాగే ఫుడ్ ఇన్స్పెక్టర్ శిరీషను వివరణ అడగగా తమ దృష్టికి రాలేదని వస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే అబ్కారీ సీఐ సంపత్ కృష్ణను ఇదే విషయంపై వివరణ కోరగా ఈ సంఘటనకు ఒక రోజు ముందే చిల్లీస్ బార్ లో తనిఖీలు చేశామన్నారు. ఆ బార్ లో ఎలాంటి కల్తీ మద్యం లేదన్నారు. ఎవరికైనా అనుమానం ఉండి లిఖితపూర్వకంగా రాసి ఇస్తే ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపిస్తామని వివరించారు.
Views: 0
About The Author

Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry's standard dummy text ever since the 1500s, when an unknown printer took a galley of type and scrambled it to make a type specimen book. It has survived not only five centuries, but also the leap into electronic typesetting, remaining essentially unchanged. It was popularised in the 1960s with the release of Letraset sheets containing Lorem Ipsum passages, and more recently with desktop publishing software like Aldus PageMaker including versions of Lorem Ipsum.

Tags:
Related Posts

Latest News
11 Sep 2025 09:10:15
ప్రశ్నిస్తే దాడికి ప్రయత్నం..!!
కామారెడ్డి : చిల్లీస్ బార్ అండ్ రెస్టారెంట్ అని గొప్ప పేరు పెట్టుకొని... అందమైన డెకరేషన్ లతో ఆకట్టుకునేలా చేసి అందులో