"సాగును కాటేస్తున్న ‘నకిలీ’ విషం: అన్నదాత భయమే పెట్టుబడిగా రసాయన మాఫియా పంజా!" 

 కొత్తగా రాబోతున్న 'పురుగుమందుల నిర్వహణ బిల్లు–2025' ఈ నకిలీ దందాకు చరమగీతం పాడుతుందా? 

 

WhatsApp Image 2026-01-26 at 3.17.48 PM

 

ప్రకృతి వైపరీత్యాలు ఒకవైపు, మార్కెట్ మాయాజాలం మరోవైపు నకిలీ విత్తనాలు ఇంకో రైతును ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వీటికి తోడు, నకిలీ పురుగుమందుల విషం సాగును లోపల నుంచే మెల్లగా చంపేస్తోంది. పంటను కాపాడాలన్న రైతు ఆందోళననే పెట్టుబడిగా మార్చుకుని, రసాయన మాఫియా లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించింది. ఈ ప్రమాదకర దందాకు అడ్డుకట్ట వేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. కాలం చెల్లిన పాత చట్టాల స్థానంలో, * పురుగుమందుల నిర్వహణ బిల్లు–2025’*ను ప్రతిపాదించి, నకిలీ తయారీదారుల ఆటకట్టించేందుకు రంగం సిద్ధం చేసింది..

 భయం చుట్టూ విస్తరిస్తున్న వ్యాపార సామ్రాజ్యం 
నేటి వ్యవసాయంలో పురుగుమందుల వినియోగం ఒక అవసరం కాదు – రైతుకు ఒక అత్యవసర పరిస్థితిగా మారిపోయింది. పంటలో చిన్న తెగులు, పురుగు కనిపించినా, “మొత్తం పంట నాశనం అవుతుందేమో” అన్న భయం రైతును వెంటాడుతుంది. అదే భయాన్ని అవకాశంగా మలుచుకుని, కొన్ని కంపెనీలు నాణ్యత లేని రసాయనాలను ఆకర్షణీయమైన ప్యాకింగ్‌లతో మార్కెట్లోకి నెట్టేస్తున్నాయి. నిపుణుల అంచనాల ప్రకారం, దేశంలో ఏటా రూ.6,000–8,000 కోట్ల వరకు నకిలీ పురుగుమందుల వ్యాపారం సాగుతోంది. రైతు పెట్టే పెట్టుబడిలో దాదాపు 25 శాతం నేరుగా నష్టంగా మారుతోందన్నది చేదు నిజం... 

నకిలీల కాటు – రైతుకే కాదు,వ్యవస్థకే ముప్పు 
నకిలీ పురుగుమందుల ప్రభావం రైతు జేబుతోనే ఆగిపోవడం లేదు. వ్యవసాయ వ్యవస్థ మొత్తం దీని వల్ల దెబ్బతింటోంది. రోగాలు తగ్గకపోగా పంట ఎండిపోవడం, పెరుగుదల ఆగిపోవడం దిగుబడులు పడిపోవడంతో రైతు అప్పుల ఊబిలోకి జారుకోవడం.


భూసారం క్రమంగా నాశనం కావడం
భూగర్భజలాలు,పర్యావరణం కలుషితం కావడం ఇవే కాకుండా, పిచికారీ సమయంలో సరైన రక్షణ లేకపోవడం వల్ల రైతుల్లో శ్వాసకోస వ్యాధులు, చర్మ సమస్యలు పెరుగుతున్నాయి. చివరికి ఆ విషపదార్థాలే మన ఆహారంలోకి చేరి సామాన్యుడి ఆరోగ్యానికీ ముప్పుగా మారుతున్నాయి..

 కొత్త చట్టం: నకిలీ రాయుళ్లకు భయం కలిగించేనా! 
ప్రస్తుతం అమల్లో ఉన్న 1968 నాటి కీటక నాశిని చట్టం నేటి పరిస్థితులకు సరిపోవడం లేదు. నామమాత్రపు జరిమానాలు, బలహీన శిక్షలు నకిలీ మాఫియాకు ఎలాంటి భయం కలిగించలేకపోయాయి. ఈ లోపాలను సరిదిద్దేందుకే కేంద్ర ప్రభుత్వం *'పురుగుమందుల నిర్వహణ బిల్లు–2025’*ను తీసుకొచ్చింది. ఈ బిల్లుపై ఫిబ్రవరి 4లోపు అభిప్రాయాలు, సూచనలు పంపాలని కేంద్రం కోరింది..

 కఠిన చట్టం.. రైతుకు రక్షణ కవచం 
వ్యవసాయ రంగంలో తిష్టవేసిన నకిలీ మాఫియా అంతానికి ప్రభుత్వం సిద్ధం చేసిన ఈ నూతన నిబంధనలు అన్నదాతకు కొండంత అండగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా:
 శిక్షల కొరడా - నకిలీలకు చెక్: నకిలీ లేదా నిషేధిత పురుగుమందుల తయారీ, విక్రయాలే లక్ష్యంగా విధిస్తున్న రూ. 50 లక్షల గరిష్ఠ జరిమానా, ఐదేళ్ల జైలు శిక్ష వంటి నిబంధనలు అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. ఇది కేవలం శిక్ష మాత్రమే కాదు, నకిలీల సామ్రాజ్యాన్ని వేళ్లతో సహా పెకిలించే గట్టి హెచ్చరిక. డిజిటల్ పర్యవేక్షణ - పారదర్శక  ప్రయాణం: 'క్యూఆర్ కోడ్' (QR Code) ఆధారిత ట్రేసిబిలిటీ వ్యవస్థ ద్వారా ప్రతి బాటిల్ ప్రయాణాన్ని తయారీ కేంద్రం నుండి రైతు పొలం వరకు డిజిటల్ పద్ధతిలో ట్రాక్ చేయడం సాధ్యమవుతుంది. ఈ సాంకేతిక అడ్డుకట్టతో సరఫరా గొలుసులో నకిలీలు ప్రవేశించే అవకాశమే లేకుండా పోతుంది

   పరిహార హక్కు - తక్షణ న్యాయం: నాణ్యత లేని మందుల వల్ల పంట నష్టపోతే, రైతు కోర్టుల చుట్టూ తిరిగే అవసరం లేకుండా నేరుగా కంపెనీల నుంచే పరిహారం పొందే వెసులుబాటు కల్పించడం ఒక విప్లవాత్మక మార్పు. ఇది రైతుకు ఆర్థిక భరోసాతో పాటు చట్టబద్ధమైన రక్షణను నిర్ధారిస్తుంది.
 కఠిన నియంత్రణ - లైసెన్సుల రద్దు: కేవలం జరిమానాలతో సరిపెట్టకుండా, నిబంధనలు ఉల్లంఘించే డీలర్లు మరియు తయారీదారుల లైసెన్సులను శాశ్వతంగా రద్దు చేసే అధికారం అధికారులకు ఇవ్వడం అభినందనీయం. ఈ చర్య వ్యవసాయ ఇన్‌పుట్ల రంగంలో జవాబుదారీతనాన్ని పెంచి, నైతిక విలువల తో కూడిన వ్యాపారానికి మార్గం సుగమం చేస్తుంది.

*అప్రమత్తతే రైతును కాపాడేది 
"నకిలీ విత్తనాలు, కల్తీ ఎరువుల నియంత్రణకు చట్టాలు ఎన్ని కఠినంగా రూపొందించినప్పటికీ, క్షేత్రస్థాయిలో రైతు అప్రమత్తతే అన్నింటికన్నా బలమైన రక్షణ కవచం. ప్రతి కొనుగోలులోనూ పారదర్శకత ఉండాలి; కంపెనీ పేరు, బ్యాచ్ సంఖ్య స్పష్టంగా నమోదైన 'పక్కా బిల్లు' తీసుకోవడం రైతు బాధ్యత మాత్రమే కాదు, మోసపోతే పోరాడేందుకు ఒక ఆయుధం కూడా. డీలర్ల వ్యాపార ప్రయోజనాలకు ప్రభావితం కాకుండా, వ్యవసాయాధికారుల శాస్త్రీయ సలహాలకు పెద్దపీట వేయాలి. అనవసర రసాయన ప్రయోగాలతో సాగును సంక్షోభంలోకి నెట్టుకోకుండా విజ్ఞతతో వ్యవహరించాలి. ఎక్కడ నకిలీల ఆనవాళ్లు కనిపించినా, వాటిని అధికారుల దృష్టికి తీసుకెళ్లడం ద్వారా తనతో పాటు తోటి రైతుల ప్రయోజనాలను కాపాడే సామాజిక బాధ్యతను ప్రతి కర్షకుడు స్వీకరించాలి."  అన్నదాతను పట్టి పీడిస్తున్న నకిలీల బెడదను అరికట్టడం వ్యవస్థల కర్తవ్యమే కాదు, సామాజిక బాధ్యత కూడా. చట్టాల అమలులో కఠినత్వం, కార్పొరేట్ శక్తుల ప్రలోభాల నుంచి రైతుకు రక్షణ కల్పించినప్పుడే సాగు లాభసాటిగా మారుతుంది. అవగాహనతో కూడిన శాస్త్రీయ సాగు వైపు రైతు అడుగులు వేయడమే 'రైతే రాజు' నినాదానికి అసలైన సార్థకత." 

 

WhatsApp Image 2026-01-26 at 3.17.48 PM(1)

జి. అజయ్ కుమార్ 
వ్యవసాయ నిపుణులు

Views: 3

About The Author

Vision Andhra Telugu Daily Picture

Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry's standard dummy text ever since the 1500s, when an unknown printer took a galley of type and scrambled it to make a type specimen book. It has survived not only five centuries, but also the leap into electronic typesetting, remaining essentially unchanged. It was popularised in the 1960s with the release of Letraset sheets containing Lorem Ipsum passages, and more recently with desktop publishing software like Aldus PageMaker including versions of Lorem Ipsum.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

కాంగ్రెస్ పార్టీ లో భారీగా చేరికలు..కండువా కప్పి పార్టీలోకి స్వాగతం పలికిన...   ఏఐసిసి కార్యదర్శి డాక్టర్ సంపత్ కుమార్ కాంగ్రెస్ పార్టీ లో భారీగా చేరికలు..కండువా కప్పి పార్టీలోకి స్వాగతం పలికిన... ఏఐసిసి కార్యదర్శి డాక్టర్ సంపత్ కుమార్
    అలంపూర్   : ఆలంపూర్ నియోజక వర్గం వడ్డేపల్లి మునిసిపాలిటీకి చెందిన మాజీ కరణం చంద్రారెడ్డి కుమారుడు వెంకటేశ్వర రెడ్డి  తన అనుచర వర్గంతో కలిసి గురువారం
మున్సిపాలిటీలో నో డ్యూ సర్టిఫికెట్ ఇవ్వకుండా కాలయాపన చేస్తున్న అధికారులు జిల్లా బిజేపి మాజీ అధ్యక్షులు ఎస్.రామచంద్రారెడ్డి
శ్రీశ్రీశ్రీ తిక్క వీరేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు (జాతరకు) ఆహ్వాన పత్రిక, గోడపత్రిక ఆవిష్కరణ చేసిన.... ప్రజాప్రతినిధులు,పట్టణ పేద్దలు
మల్లికార్జునగిరి నర్సరీ పరిశీలన
జిల్లా మీడియా మానిటరింగ్ కమిటీ సభ్యునిగా ఇటిక్యాల ఇంద్రసేనారెడ్డి
పాఠశాలను తనిఖీ చేసిన ప్యానల్ ఇన్స్పెక్షన్ బృందం.
కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న చేరికల పరంపర...