తెలంగాణ ఉన్నత విద్యా మండలి నూతన క్యాలెండర్ ప్లానర్ విడుదల చేసిన టీజీసీహెచ్‌ఈ చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకృష్ణ రెడ్డి

IMG-20260109-WA0812  
హైదరాబాద్ :  ఈ రోజు తెలంగాణ ఉన్నత విద్యా మండలిలో తెలంగాణ ఉన్నత విద్యామండలి నూతన సంవత్సరం డైరీ క్యాలెండర్, కమ్ ప్లానర్‌ను ఛైర్మన్ ప్రొ. వి.బాలకిష్టా రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణా రెడ్డి మాట్లాడుతూ.. గత ఏడాది భారత రత్నాలు, ఈసారి విశ్వ విద్యావేత్తల క్యాలెండర్‌లో, దేశానికి చెందిన మహనీయులైన సావిత్రీబాయి ఫూలే, డా.జాకిర్ హుస్సేన్, చాణక్యుడు, గౌతమ బుద్ధుడు, గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్, స్వామి వివేకానంద, సర్వేపల్లి రాధాకృష్ణన్, మదర్ థెరిస్సా, గిజుభాయ్ బధేకా, ఏపీజే అబ్దుల్ కలాం, పండిట్ మదన్ మోహన్ మాలవ్య, కైలాష్ సత్యార్థి వంటి ప్రముఖులను గౌరవించినట్లు ప్రొ. వి. బాలకిష్టా రెడ్డి గుర్తు చేశారు. విద్య వ్యాప్తి, శాస్త్రీయ దృక్పథం, మానవ హక్కులు, హేతువాదాన్ని పెంపొందించడంలో వారి కృషిని దృష్టిలో ఉంచుకుని ఆ నిర్ణయం తీసుకున్నామని వివరించారు. 

ఉన్నత విద్యపై విస్తృత చర్చకు శ్రీకారం : ప్రస్తుత ఈ నూతన సంవత్సర క్యాలెండర్ ఒక విభిన్నమైన లక్ష్యంతో రూపొందించ బడి, ప్రపంచ వ్యాప్తంగా జ్ఞానం, సమాచారం యొక్క వ్యాప్తి, ప్రజా స్వామ్యీకరణలో అత్యంత ముఖ్యమైన పాత్ర పోషించిన మేధావులు, పండితులు, క్రియాశీలుల ద్వారా ఉన్నత విద్య పై చర్చను మరింత ముందుకు తీసుకుపోవాలని మండలి సంకల్పించిందని అన్నారు, ఈ మహనీయులు సామాజిక నైతిక విలువలు, విమర్శనాత్మక ఆలోచన, మేధోపరమైన పరిశోధన, విద్యార్థుల పట్ల మానవీయత, నిరంతర అభ్యాసం, తరగతి గదిలో ప్రజాస్వామ్యం, సమస్య పరిష్కార పద్ధతులు, విద్యార్థి కేంద్రీకృత విధానాలు, అనుభవపూర్వక అభ్యాసం, ఉపాధ్యాయ శిక్షణ, విభిన్నత (డైవర్సిటీ), అలాగే సిలబస్‌లో ప్రపంచ దృక్పథాలను పొందు పరచడంలో విశేష సేవలను అందించామన్నారు.

ఈ నూతన క్యాలెండర్‌లో ప్రముఖ విద్యావేత్తలు విద్యావేత్త కాలం వారి కీలక సేవలు: కన్ఫ్యూషియస్, 551–479 BCE నైతిక విలువలు, నిరంతర అభ్యాసాన్ని ప్రోత్సహించారు.  సాక్రటీస్ C 470 399 BCE ప్రశ్నించే సాక్రటిక్ పద్ధతి ద్వారా విమర్శనాత్మక ఆలోచనకు ప్రాణం పోశారు. క్వింటిలియన్ C 35–100 AD విద్యపై మొదటి సమగ్ర గ్రంథాన్ని రచించి, విద్యార్థుల పట్ల మానవీయతకు ప్రాధాన్యత ఇచ్చారు. మిషెల్ డి మోంటైన్ 1533–1592 బాలల కేంద్రీకృత అభ్యాస బట్టీ పద్ధతికి బదులు, అనుభవానికి ప్రాధాన్యత ఇచ్చారు. జాన్ లాక్ 1632–1704 అనుభవ పూర్వక అభ్యాసం, ప్రారంభ బాల్య విద్య ప్రాముఖ్యతపై ఆధునిక విధానాలకు పునాది వేశారు. మేరీ వోల్‌స్టోన్‌క్రాఫ్ట్ 1759 1797 స్త్రీల సమాన విద్య కోసం పోరాడిన తొలి స్త్రీవాద విద్యావేత్త, హోరేస్ మాన్ 1796 1859 అమెరికాలో ఆధునిక ప్రభుత్వ పాఠశాల వ్యవస్థ ను స్థాపించి, సార్వత్రిక విద్యకు కృషి చేశారు. జాన్ డ్యూయీ 1859 1952 ప్రయోగాత్మక అభ్యాసం పై తన సిద్ధాంతాలతో ఆధునిక విద్యను మలుపు తిప్పారు. డైసాకు ఇకెడా 1928–2023 శాంతి, మానవతా విలువలు, ప్రపంచ పౌరసత్వం పై సోకా విద్యా వ్యవస్థను స్థాపించారు. సేమౌర్ ఆబ్రే పాపర్ట్ 1928–2016 కంప్యూటర్‌లను అభ్యాసం సృజనాత్మకతకు ఉపకరణాలుగా మార్చడంలో విప్లవం సృష్టించిన గణిత శాస్త్రజ్ఞుడు, న్గూగీ వా తియోంగో 1938–2025 దేశీయ భాషలు జ్ఞాన వ్యవస్థల వలస రాజ్యాల విముక్తి కోసం పోరాడారు. హోమి కె. భాభా 1949 (ప్రస్తుతం) భారతీయ మూలాలు కలిగిన ఈ పండితుడు, పోస్ట్‌కొలోనియల్ సిద్ధాంతం ద్వారా సిలబస్‌లో వైవిధ్యాన్ని, ప్రపంచ దృక్పథాన్ని పెంచారు అని వివరించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఛైర్మన్ ప్రొ. ఈ.పురుషోత్తం, వైస్ ఛైర్మన్ ప్రొ. ఎస్.కె. మహమూద్, కార్యదర్శి ప్రొ. శ్రీరామ్ వెంకటేష్‌తో పాటు మండలి సిబ్బంది పాల్గొన్నారు. 

Views: 18

About The Author

Vision Andhra Telugu Daily Picture

Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry's standard dummy text ever since the 1500s, when an unknown printer took a galley of type and scrambled it to make a type specimen book. It has survived not only five centuries, but also the leap into electronic typesetting, remaining essentially unchanged. It was popularised in the 1960s with the release of Letraset sheets containing Lorem Ipsum passages, and more recently with desktop publishing software like Aldus PageMaker including versions of Lorem Ipsum.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

తెలంగాణ ఉన్నత విద్యా మండలి నూతన క్యాలెండర్ ప్లానర్ విడుదల చేసిన టీజీసీహెచ్‌ఈ చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకృష్ణ రెడ్డి తెలంగాణ ఉన్నత విద్యా మండలి నూతన క్యాలెండర్ ప్లానర్ విడుదల చేసిన టీజీసీహెచ్‌ఈ చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకృష్ణ రెడ్డి
  హైదరాబాద్ :  ఈ రోజు తెలంగాణ ఉన్నత విద్యా మండలిలో తెలంగాణ ఉన్నత విద్యామండలి నూతన సంవత్సరం డైరీ క్యాలెండర్, కమ్ ప్లానర్‌ను ఛైర్మన్ ప్రొ.
పేదింటి ఆడబిడ్డలకు ప్రభుత్వం అండ
అయోడిన్ పై శిక్షణ అవగాహన కార్యక్రమం
ఐబీఎస్ హైదరాబాద్లో ‘త్రిష్ణ 2కె26’ ఘన ప్రారంభం
దేహదారుఢ్యం అత్యంత ఆవశ్యకం
ఆదర్శ పాఠశాలలో సంక్రాంతి సంబరాలు
గ్రామ స్థాయి నుండి జాతీయ స్థాయి వరకు ప్రజా గళాన్ని పత్రికలు బలంగా వినిపించాలి : బిజెపి ఎంపి. డికే. అరుణ