కదం తొక్కిన కలం కార్మికులు సమాచార భవన్ వద్ద జర్నలిస్టుల ఆందోళన

WhatsApp Image 2026-02-17 at 5.32.15 PM

 

హైదరాబాద్  : కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆర్ఎన్ఐ, పీఆర్ జీఐ రిజిస్ట్రేషన్ కలిగిన చిన్న,మధ్య తరహా పత్రికలకు అక్రెడిటేషన్లు ఇవ్వకుండా, ఎంప్యానల్‌మెంట్ చేయకుండా వివక్ష చూపుతున్న ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ మంగళవారం ఆయా పత్రికల జర్నలిస్టులు హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ లోని సమాచార పౌరసంబధాల శాఖ కమీషనర్ కార్యాలయం (సమాచార భవన్) ఎదుట ఆందోళన చేపట్టారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) ఇచ్చిన "ఛలో సమాచార భవన్" పిలుపు మేరకు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన చిన్న, మధ్య తరహా పత్రికల నిర్వహకులు, పాత్రికేయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ర్యాలీగా వెళ్లిన జర్నలిస్టులు దాదాపు రెండు గంటల పాటు కార్యాలయం ప్రవేశ ద్వారం ఎదుట బైఠాయించి ధర్నా చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్)  వ్యవస్థాపక అధ్యక్షుడు,రాష్ట్ర కన్వీనర్ మామిడి సోమయ్య మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం  వచ్చిన తర్వాత స్వరాష్ట్రంలో చిన్న, మధ్య తరహా పత్రికల అణచివేత కొనసాగుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ సారి 44 వేలకు పైగా అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వనున్నట్లు ప్రకటించినప్పటికీ, కేవలం ఎంపానల్మెంట్ అయిన కొన్ని పత్రికలకు,చానళ్ళకు మాత్రమే ఇస్తూ మిగతా పత్రికలకు అన్యాయం చేస్తున్నారని అన్నారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో ఎంపానల్మెంట్ తో సంబంధం లేకుండా ఆర్ఎన్ఐ గుర్తింపు ఉన్న అన్ని పత్రికలకు ఆయా పత్రికల సర్క్యులేషన్ ఆధారంగా జర్నలిస్టులందరికి అక్రెడిటేషన్ కార్డులిచ్చే వారని, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆ పద్దతిని తుంగలో తోక్కి పత్రికలకు ఎంప్యానల్ ముసుగు తొడిగి, నిబంధనల పేరుతో చిన్న,మధ్య తరహా పత్రికలను పాతాళానికి తొక్కారని మామిడి సోమయ్య ధ్వజమెత్తారు. తెలంగాణ స్వరాష్ట్రంలోనే చిన్న మధ్య తరహా పత్రికలకు, వాటిలో పనిచేస్తున్న జర్నలిస్టులకు తీరని అన్యాయం జరుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ తొలి ప్రభుత్వం జర్నలిస్టులకు చేసిన అన్యాయంపై ఆనాడు గొంతెత్తిన ఈనాటి పాలకులు అధికారంలోకి వచ్చి రెండేండ్లయినా...అనేక పత్రికలను ఎంపానల్మెంట్ చేయకుండా జర్నలిస్టులకు అన్యాయం చేస్తున్నారనని ఆయన ధ్వజమెత్తారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే జర్నలిస్టులందరికీ సరైన న్యాయం చేస్తామని నమ్మబలికిన  పాలకులు మీడియా అక్రిడిటేషన్ ల విషయంలోనే వివక్ష చూపుతూ చిన్న మధ్య తరహా పత్రికలకు అన్యాయం చేస్తున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఆర్ఎన్ఐ,పీఆర్జీఐ గుర్తింపు ఉన్న పత్రికలను ఎంప్యానల్ చేయకుండా రెండేళ్లుగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని, కనీసం అక్రెడిటేషన్లు ఇవ్వకుండా అణిచివేస్తున్నారని ధ్వజమెత్తారు. మరోవైపు ఎంప్యానల్ లిస్టులో ఉన్న చాలా పత్రికలను ఆ జాబితా నుంచి తొలగించి జర్నలిస్టులను ఆందోళనకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సందర్బాన్ని బట్టి దరఖాస్తు చేసుకుంటే అడ్వర్టయిజ్మెంట్ తో పాటు అక్రెడిటేషన్ ఇచ్చే వారని, ప్రస్తుతం అడ్వర్టయిజ్మెంట్ల సంగతి దేవుడెరుగు గానీ...కనీసం అక్రెడిటేషన్ కార్డు ఇవ్వకపోవడం దుర్మార్గమని అన్నారు. ప్రభుత్వ వివక్ష కారణంగా స్వరాష్ట్రంలో చిన్న పత్రికల మనుగడ ప్రశ్నార్ధకంగా మారుతుందని, దీని వల్ల ఎంతో మంది సీనియర్ జర్నలిస్టులకు పత్రికల నిర్వహణ భారమవుతుందని అన్నారు. దీనికి తోడు మూలిగే నక్కమీద తాటికాయపడ్డట్టు ఎంప్యానల్‌లో ఉన్న పత్రికలను ఆ జాబితా నుంచి తొలగించడం చాలా భాదాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పునరాలోచన చేసి ఆర్ఎన్ఐ,పీఆర్జీఐ రిజిస్ట్రేషన్ కలిగి ఉన్న ప్రతి పత్రికకు అక్రిడిటేషన్‌ కార్డులు గతంలో మాదిరిగా ఇవ్వాలని మామిడి సోమయ్య డిమాండ్ చేశారు. అదేవిధంగా ఆయా పత్రికలకు ఎంప్యానల్‌తో సంబంధం లేకుండా నెలకు కనీసం ఒక  అడ్వర్టయిజ్మెంట్ ఇవ్వాలని, ప్రింటింగ్ ప్రెస్ కోసం ఒక ఎకరం భూమిని  ప్రభుత్వ నామినల్ ధరకు ఇచ్చి ప్రింటింగ్ ప్రెస్ ఏర్పాటుకు రుణ సదుపాయం కల్పించాలని కోరారు. జర్నలిస్టులకు అక్రెడిటేషన్ ఉన్న జిల్లాలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీలో ప్రయాణించేందుకు ఉచిత బస్ పాస్ ఇవ్వాలని, హెల్త్‌కార్డులు,భీమా సౌకర్యం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర నాయకులు తన్నీరు శ్రీనివాస్, కె. పాండురంగారావు, పద్మనాభరావు, యర్రమిల్లి రామారావు,పొట్లపల్లి అశోక్ గౌడ్,హైదరాబాద్ జిల్లా నాయకులు వి.రవికుమార్, శ్రీనివాస్ గౌడ్, బ్రహ్మం, సంతోష్, మేడ్చల్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మల్లేశం, గడ్డమీది అశోక్, పర్వతాలు నంబి,నాయకులు డప్పు రామస్వామి,శంకర్, శివకుమార్,సంజీవ్ కుమార్, మంజులారెడ్డి, సౌభాగ్యవతి, సుష్మిత, శివపార్వతి, సూర్యాపేట జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పాల్వాయి జానయ్య, హరి ప్రసాద్, వరంగల్  జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు జక్కుల విజయ్ కుమార్, స్వామిదాస్, నిజామాబాద్ జిల్లా నేతలు కుంచెం శ్రీనివాస్, పానుగంటి శ్రీనివాస్, యార్వ నరేష్,మహాదేవ్ ప్రసాద్ రాజు, నల్గొండ జిల్లా నాయకులు వెలుతురు యాదయ్య, జీడిమట్ల రవీందర్, నాగయ్య, పరమేష్, లింగస్వామి తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఐ అండ్ పీఆర్ జాయింట్ డైరెక్టర్ జగన్ కు డిమాండ్లతో కూడిన వినతి పత్రం సమర్పించారు.

Views: 14

About The Author

Vision Andhra Telugu Daily Picture

Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry's standard dummy text ever since the 1500s, when an unknown printer took a galley of type and scrambled it to make a type specimen book. It has survived not only five centuries, but also the leap into electronic typesetting, remaining essentially unchanged. It was popularised in the 1960s with the release of Letraset sheets containing Lorem Ipsum passages, and more recently with desktop publishing software like Aldus PageMaker including versions of Lorem Ipsum.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

బాల్య వివాహాలను అరికట్టడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి.. బాల్య వివాహాలను అరికట్టడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి..
    కరీంనగర్  : బాల్య వివాహాలను అరికట్టేందుకు సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతతో కృషి చేయాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్
సిరిసిల్ల మున్సిపల్ చైర్మన్ పీఠం బిఆర్ఎస్ పార్టీ కైవసం. మున్సిపల్ చైర్మన్గా జిందం కళ చక్రపాణి. వైస్ ఛైర్మన్ గా దార్ల సందీప్.
జిల్లాలో మోడల్ అంగన్వాడి కేంద్రాలు ఏర్పాటు చేయాలి..జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్..
ప్రతి పౌరుడు తమ బాధ్యతలను, హక్కులను తెలుసుకోవాలి ఎన్ హెచ్ ఆర్ సి. రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య
కదం తొక్కిన కలం కార్మికులు సమాచార భవన్ వద్ద జర్నలిస్టుల ఆందోళన
మధిర మున్సిపల్ చైర్ పర్సన్ సామినేని సుజాత వైస్ చైర్ పర్సన్ కోన ధని కుమార్ ను సన్మానించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు.
నల్లగొండలో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు