దేశాభివృద్ధిలో అకౌంటింగ్ పాత్రపై దృష్టి సారించారు..
- టీజీసీహెచ్ఈ చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్ట రెడ్డి

2047 నాటికి $ 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్..
హైదరాబాద్ : వికసిత్ భారత్ 2047లో అకౌంటింగ్ పాత్ర అనే అంశంపై సెమినార్ బదృక కాలేజ్ కాచిగూడలో నిర్వహించారు. సమావేశం కామర్స్ విభాగానికి చెందిన సహాయ ప్రొఫెసర్ శ్రీమతి సంధ్య గౌరవ అతిథుల స్వాగతంతో ప్రారంభమైంది, అనంతరం గౌరవ అతిథులు సంప్రదాయ దీపప్రజ్వలన నిర్వహించారు, కార్యక్రమం విజయవంతంగా సాగాలని ఆకాంక్షిస్తూ బీ.కాం (ఆనర్స్) విద్యార్థి ప్రార్థనా గీతం ఆలపించారు,స్వాగత ప్రసంగాన్ని బీసీసీఏ ప్రిన్సిపాల్ డా. బి. మోహన్ కుమార్ గారు అందించారు. అకౌంటింగ్ మరియు ఫైనాన్స్ విద్య భవిష్యత్ వృత్తిప రులను తీర్చి దిద్దడంలో ఎంత ముఖ్యమో ఆయన వివరించారు, తదుపరి ఎస్జీజీబీఈఎస్ డైరెక్టర్ జనరల్ ప్రొఫెసర్ ఎస్.అభిరామ కృష్ణ, ఐఏఏ హైదరాబాద్ శాఖ చైర్మన్ ప్రొఫెసర్ డి. ఒబుల్ రెడ్డి, వైస్ చైర్మన్ సిఎంఏ డా. కె. చ. ఏ. వి. ఎస్. ఎన్. మూర్తి, సెక్రటరీ సిఎంఏ ప్రొఫెసర్ గడ్డం నరేష్ రెడ్డి ప్రసంగించారు.

అనంతరం ముఖ్య అతిధులు టీజీసీహెచ్ఈ చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్ట రెడ్డి మాట్లాడుతూ.. వృత్తిపర నైతిక విలువలు. పరిశోధన దృష్టి, దేశాభివృద్ధిలో అకౌంటింగ్ మారుతున్న పాత్రపై వివరించారు. అకౌంటింగ్ మరియు ఫైనాన్స్ జాతీయ సంపదను కొలవడంలో మరియు నిర్వ హించడంలో కీలక పాత్ర పోషిస్తాయని ఆయన పేర్కొన్నారు, మీరు కేవలం విద్యార్థులు కాదు భారతదేశ భవిష్యత్తు అనే ఆకర్షణీయమైన మాటలతో తన ప్రసంగం ఆకట్టుకుంది, అకౌంటింగ్ దృఢమైన ఆర్థిక నిర్ణయాలకు మరియు స్థిరమైన ఆర్థిక అభివృద్ధికి పునాది అని వివరించారు, అకౌంటింగ్ మరియు ఫైనాన్స్ యొక్క పరిణామాన్ని గతం, వర్తమానం, భవిష్యత్తు (కాల్, ఆజ్ ఔర్ కాల్) పరంగా విశ్లేషించారు, అలాగే ప్రణాళిక అమలు, పరిరక్షణ అనే ఫ్రేమ్వర్క్ను పరిచయం చేస్తూ, సంస్థలు మరియు ఆర్థిక వ్యవస్థకు అవి ఎంత ముఖ్యమో వివరించారు, పరిశోధన & ఆవిష్కరణలు, పారదర్శకత, మద్దతు వ్యవస్థలు, మంచి పాలన వంటి అంశాలతో కూడిన వికసిత్ భారత్ 2047 మిషన్ ప్రాధాన్యతను, అమెరికా, జపాన్, యూరప్ దేశాలతో గ్లోబల్ ఆర్థిక పోలికలు చేస్తూ, భారత్ ప్రపంచంలో టాప్ 10 ఆర్థిక శక్తులలో ఒకటిగా ఎదిగిందని, సరైన పరిశోధన, ఆవిష్కరణలు, కార్పొరేట్ గవర్నెన్స్తో 2047 నాటికి 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారగల సామర్థ్యం ఉందని పేర్కొన్నారు, యువత దేశాభివృద్ధికి ప్రధాన శక్తి అని, భారత్ను యూత్ నేషన్ గా అభివర్ణించారు, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ప్రాముఖ్యతను ముఖ్యంగా విద్యాసంస్థల సామాజిక బాధ్యతను వివరించారు, మునుపు స్వచ్ఛందంగా ఉన్న CSR ఇప్పుడు తప్పనిసరి అయ్యిందని, దీనిని అకాడమిక్ సోషల్ రెస్పాన్సిబిలిటీ గా పేర్కొన్నారు, సమాజానికి తిరిగి ఇవ్వడం ప్రతి కళాశాల బాధ్యత అని విద్యార్థులకు సమయం, ప్రతిభ, స్వేచ్ఛ ఇవ్వాల్సిన అవసరాన్ని తెలిపారు, కృత్రిమ మేధస్సు (ఏఐ) ప్రపంచాన్ని ఎలా ప్రభావితం చేయబోతుందో వివరిస్తూ, ఏఐ ప్రపంచాన్ని శాసించబోతోంది అనే భావనను తెలుగు సామెతతో పోల్చి వివరించారు, వికసిత్ భారత్ 2047లక్ష్యం మరియు స్వాతంత్ర్యానికి వంద సంవత్సరాల దృష్టికోణం గురించి ప్రస్తావించారు, విజయవంతం కావాలంటే యువత ఫేస్బుక్ నుంచి టెక్స్ట్బుక్ వైపు మారాలని సూచిస్తూ తన ప్రసంగాన్ని ముగించారు, గౌరవ అతిథుల చేతుల మీదుగా స్మారక సంచిక విడుదల చేయడంతో ప్రారంభ సమావేశం ముగిసింది. అనంతరం కామర్స్ విభాగానికి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ డా. ఎం.జనకిరామ్ గారు కృతజ్ఞతలు తెలిపారు.
సాంకేతిక సమావేశం వికసిత్ భారత్ 2047లో అకౌంటింగ్ పాత్ర సాంకేతిక సమావేశం–I కు ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలోని సికింద్రాబాద్ పీజీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎస్. కవితా దేవి, అధ్యక్షత వహిస్తూ తన ప్రసంగంలో వికసిత్ భారత్ 2047 లక్ష్యాలను సాధించడంలో పరిశోధన, నాయకత్వ నైపుణ్యాలు, విద్యాసంస్థల బాధ్యత ప్రాముఖ్యతను వివరించారు. కీ నోట్ అడ్రస్ను సిఎ నాగ దుర్గ సుధాకర్ అందిస్తూ 2047 నాటికి వికసిత్ భారత్ దృష్టికోణం, జీడీపీ, వ్యక్తి ప్రాతిపదిక ఆదాయం, మంచి పాలన వంటి సూచికల ప్రాధాన్యతను వివరించారు. ముఖ్యంగా ఎంఎస్ఎంఈలు మరియు స్టార్టప్లకు చట్టబద్ధత, ఆర్థిక క్రమశిక్షణ, పారదర్శకత ఎంత ముఖ్యమో వివరించారు. ఈ సమావేశంలో అకౌంటింగ్, ఫైనాన్స్, పాలన, ఆర్థిక అభివృద్ధి వంటి సమకాలీన అంశాలపై మొత్తం 28 పరిశోధన పత్రాలు సమర్పించబడ్డాయి, సార్థకమైన చర్చలు మరియు అకడమిక్ ఆలోచనల మార్పిడితో సమావేశం విజయవంతంగా ముగిసింది, కీ నోట్ స్పీకర్ సిఎంఏ కె.వి.ఎన్. లావణ్య (కాస్ట్ అకౌంటెంట్) వికసిత్ భారత్ 2047 దృష్టి కోణంపై ప్రసంగిస్తూ. ఈ మిషన్లో సమగ్ర అభివృద్ధి, బలమైన సంస్థలు, ఆర్థిక గౌరవం, స్థిరమైన సంపద సాధన (రామ రాజ్య సాధన) వంటి అంశాలు ఉన్నాయని వివరించారు.

About The Author
Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry's standard dummy text ever since the 1500s, when an unknown printer took a galley of type and scrambled it to make a type specimen book. It has survived not only five centuries, but also the leap into electronic typesetting, remaining essentially unchanged. It was popularised in the 1960s with the release of Letraset sheets containing Lorem Ipsum passages, and more recently with desktop publishing software like Aldus PageMaker including versions of Lorem Ipsum.


