మున్సిపాలిటీ ఎన్నికల్లో బిజేపి గెలుపే లక్ష్యంగా సమిష్టిగా కృషి చేయాలి

అలంపూర్ : జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మున్సిపాలిటీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులంతా సమిష్టిగా, క్రమశిక్షణతో పనిచేయాల్సిన అవసరం ఉందని జోగులాంబ గద్వాల జిల్లా భారతీయ జనతా పార్టీ మాజీ అధ్యక్షులు ఎస్. రామచంద్రారెడ్డి అన్నారు. బీజేపీ అయిజ పట్టణ అధ్యక్షులు కంపాటి భగత్ రెడ్డి అధ్యక్షతన, దుర్గా నగర్లోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించబడింది.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షులు ఎస్. రామచంద్రారెడ్డి హాజరై కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు.
అయిజ పట్టణ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, అవినీతి రహిత పాలన భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. ప్రతి కార్యకర్త తన వార్డు, బూత్ పరిధిలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం సాధిస్తున్న అభివృద్ధిని ప్రజలకు స్పష్టంగా వివరించాలన్నారు. అలాగే, గత పాలకుల వైఫల్యాలను ప్రజలకు వివరించి, అయిజ మున్సిపాలిటీలో బీజేపీనే నిజమైన అభివృద్ధి ప్రత్యామ్నాయమని బలంగా చెప్పాలని పిలుపునిచ్చారు.అయిజ మున్సిపాలిటీ ఎన్నికలను భారతీయ జనతా పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోందని తెలిపారు.
ఈ సమావేశంలో బిజేపి అయిజ పట్టణ అధ్యక్షులు కంపాటి భగత్ రెడ్డి మాట్లాడుతూ, గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా అయిజ మున్సిపాలిటీ పరిధిలో రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు వంటి మౌలిక వసతులు తీవ్రంగా దెబ్బతిన్నాయని అన్నారు. ఈ సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడే పార్టీగా భారతీయ జనతా పార్టీ నిలుస్తుందని స్పష్టం చేశారు.కార్యకర్తలే పార్టీకి అసలైన బలమని పేర్కొన్న భగత్ రెడ్డి, ప్రతి ఒక్కరూ ఐక్యతతో, క్రమశిక్షణతో పనిచేస్తే అయిజ మున్సిపాలిటీలో భారతీయ జనతా పార్టీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ వేగవంతం చేశారు.రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు, మహబూబ్నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణమ్మ సూచనల ప్రకారం, అయిజ మున్సిపాలిటీ పరిధిలో వార్డుల వారీగా ఇన్చార్జిలను నియమించడం జరిగిందన్నారు. భారతీయ జనతా పార్టీ అయిజ మున్సిపాలిటీ గెలుపే లక్ష్యంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాదన్న, కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడికొండ బీమ్సేన్ రావు, అయిజ మండల అధ్యక్షులు గోపాలకృష్ణ, జిల్లా కౌన్సిల్ మెంబర్ ప్రదీప్ కుమార్, అయిజ పట్టణ ఉపాధ్యక్షులు, బూత్ అధ్యక్షులు, కార్యకర్తలు, ఆశావాదులు, తదితరులు పాల్గొన్నారు.
About The Author
Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry's standard dummy text ever since the 1500s, when an unknown printer took a galley of type and scrambled it to make a type specimen book. It has survived not only five centuries, but also the leap into electronic typesetting, remaining essentially unchanged. It was popularised in the 1960s with the release of Letraset sheets containing Lorem Ipsum passages, and more recently with desktop publishing software like Aldus PageMaker including versions of Lorem Ipsum.


