చండ్రుపల్లిలో డ్రైనేజ్ సమస్యకు చెక్

చండ్రుపల్లిలో డ్రైనేజ్ సమస్యకు చెక్

జయశంకర్ భూపాలపల్లి / మహాదేవపూర్ : మండలం చండ్రుపల్లి గ్రామంలో చాలా కాలంగా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న డ్రైనేజ్ సమస్యకు గ్రామ సర్పంచ్ గుర్సింగ్ బాపు చొరవతో పరిష్కారం లభించింది.గ్రామంలో మురుగు నీరు నిల్వ ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుండగా, సమస్యను గుర్తించిన సర్పంచ బాపు స్పందించి జేసీబీ సహాయంతో మురుగు కాలువలను శుభ్రం చేయించి నీటి పారుదలను సక్రమంగా ఏర్పాటు చేశారు.డ్రైనేజ్ వ్యవస్థను పునరుద్ధరించడంతో నిల్వ ఉన్న మురుగు నీరు బయటకు వెళ్లి గ్రామంలో పారిశుద్ధ్య పరిస్థితులు మెరుగుపడ్డాయి. దీంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ, సమస్యను వెంటనే పరిష్కరించిన సర్పంచ్ గుర్సింగ్ బాపుకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి తక్షణ చర్యలు తీసుకోవడం అభినందనీయమని పలువురు గ్రామస్థులు పేర్కొన్నారు. గ్రామ అభివృద్ధి, పారిశుద్ధ్యానికి ప్రాధాన్యం ఇస్తూ ఇలాంటి పనులు కొనసాగించాలని వారు కోరారు.

Views: 3

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

అనంతగిరి శ్రీ అనంత పద్మనాభస్వామి పెరుగు బసంతోత్సవం అనంతగిరి శ్రీ అనంత పద్మనాభస్వామి పెరుగు బసంతోత్సవం
మర్పల్లి,: వికారాబాద్ జిల్లా కేంద్రంలో నీ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అనంతగిరి శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో బుధవారం నిర్వహించిన పెరుగు బసంతోత్సవంలో తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి గడ్డం...
14 మందికి క్వార్టర్ల కేటాయింపు 
ఘనంగా భక్తిశ్రద్ధలతో గురుపౌర్ణమి వేడుకలు
‘క్యాతన్ పల్లిలో’ కమిషనర్ విధులకు ఆటంకం 
విద్యార్థుల అభ్యాస లోపాలపై ప్రత్యేక దృష్టి సారించాలి
భక్తులతో కిటకిటలాడిన సాయిఆలయాలు
వన్యప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత