సకాలంలో స్పందించిన పోలీసులు
ప్రజల ప్రశంసలు అందుకున్న మేడిపల్లి పోలీస్ సిబ్బంది
మేడిపల్లి/భీమారం (జగిత్యాల) :నిన్న రాత్రి కురిసిన భారీ వర్షం, ఈదురు గాలుల ప్రభావంతో మేడిపల్లి మండల కేంద్రంలోని జాతీయ రహదారి ఎన్హెచ్-63పై బుధవారం ఉదయం 5గంటలకు ఓ భారీ వృక్షం కూలి రోడ్డుకు అడ్డంగా పడింది. అదే సమయంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న మేడిపల్లి పోలీసులు ఈ ఘటనను గమనించి వెంటనే అప్రమత్తమవడంతో భారీ ప్రమాదం తప్పింది. పెట్రోలింగ్ సిబ్బంది ఆలస్యం చేయకుండా జేసీబీ యజమాని జలంధర్, మహేష్ సహకారంతో వృక్షాన్ని తొలగించి రహదారిని పూర్తిగా క్లియర్ చేశారు. దీంతో వాహనాల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా ట్రాఫిక్ను పునరుద్ధరించారు. విధి నిర్వహణలో చురుకుగా వ్యవహరించి ప్రమాదాన్ని నివారించిన పోలీసు సిబ్బంది నాగరాజును మేడిపల్లి మండల ఎస్సై శ్రీధర్ రెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా ఎస్సై శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రహదారులపై ప్రయాణించే సమయంలో జాగ్రత్తలు పాటించాలని, ఎక్కడైనా చెట్లు కూలడం, రోడ్లు దెబ్బతినడం, ఇతర అత్యవసర పరిస్థితులు ఎదురైతే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


