మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుదాం...
మొక్కలు నాటిన విసిహెచ్ గ్రూప్ సభ్యులు
పటాన్ చేరు(సంగారెడ్డి) : పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతగా మొక్కలు నాటుదాం- పర్యావరణాన్ని కాపాడుకుదాం అని విసిహెచ్ గ్రూప్ సభ్యులు అన్నారు. విసిహెచ్ గ్రూప్ సభ్యుల ఆధ్వర్యంలో స్థానిక డివిజన్ పరిధిలోని స్మశాన వాటికలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వచ్ఛమైన వాతావరణం కోసం నాటిన ప్రతి మొక్కను కాపాడుకోవాల్సిన బాధ్యతను ప్రతి ఒక్కరు తీసుకోవాలన్నారు. భూమండలంపై కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రాణవాయువు శాతాన్ని పెంచేందుకు, వర్షాలు పడేందుకు, విపత్తుల సమయంలో చెట్లు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో సంజీవ్ మీసేవ, సంజీవ్ రెడ్డి, రామకృష్ణ, పవన్, రాజు, వీర్, వికాఫ్, విసిహెచ్ గ్రూప్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Views: 8
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
29 Jul 2026 18:29:50
మర్పల్లి,: వికారాబాద్ జిల్లా కేంద్రంలో నీ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అనంతగిరి శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో బుధవారం నిర్వహించిన పెరుగు బసంతోత్సవంలో తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి గడ్డం...
