బిహెచ్ఈఎల్ ఆర్టిసి భక్తిప్యాకేజి
- 3వేల 500 రూపాయలతో షిరిడి యాత్ర
- 31వ తేది బస్సు బయలుదేరును
- వెల్లడించిన డిపోమేనేజర్ మోహన్ రావు
పటాన్ చెరు (సంగారెడ్డి): పటాన్ చెరు పరిధిలోని బిహెచ్ఈఎల్ ఆర్టిసి ప్రత్యేక భక్తి ప్యాకేజీని ఏర్పాటు చేసింది. ఈ నెల 31వ తేదిన కెపిహెచ్బి నుంచి సూపర్ లగ్జరీ బస్సు బయలుదేరుతుందని, ఒక్కోక్కరికి టిక్కెట్ ధర 3500 రూపాయలుగా నిర్ణయించడం జరిగిందని డిపోమేనేజర్ మోహన్ రావు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 31వ తేదిన బయలుదేరే బస్సు గానుగాపూర్, పండరీపూర్, షిరిడి, శనిసంగాపూర్, తుల్జాపూర్లకు వెళ్లి తిరిగి ఆగస్టు 4వ తేదిన హైదరాబాద్ చేరుకుంటుందని తెలిపారు. బస్సు టిక్కెట్ బుకింగ్ కోసం www.tgsrtcbus.in లేదా 8500309052, 9063400960, 7382814249, 7382814582 ఫోన్నంబర్లను సంప్రదించాలని తెలిపారు. బిహెచ్ఈఎల్, ఆర్సిపురం, కెపిహెచ్బి, కుక్కట్పల్లి, మియాపూర్ ప్రాంతాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Views: 1
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
29 Jul 2026 18:29:50
మర్పల్లి,: వికారాబాద్ జిల్లా కేంద్రంలో నీ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అనంతగిరి శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో బుధవారం నిర్వహించిన పెరుగు బసంతోత్సవంలో తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి గడ్డం...
