భక్తులతో కిటకిటలాడిన సాయిఆలయాలు

ఘనంగా గురుపౌర్ణిమ పూజోత్సవాలు

భక్తులతో కిటకిటలాడిన సాయిఆలయాలు

 నిజామాబాద్,:  జిల్లాలోని సాయిబాబా ఆలయాలు గురు పౌర్ణమి సందర్భంగా భక్తులతో కిటకిటలాడాయి. ఉదయం 5 గంటల నుండి భక్తులు  ఆలయాల వద్దకు విచ్చేసి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. జిల్లాలోని మాధవనగర్ సాయిబాబా ఆలయంలో  చైర్మన్ మీనా శ్రీనివాస్ దంపతులు, ఆలయ డైరెక్టర్లు  ప్రత్యేక హోమం నిర్వహించి అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. రైల్వే కమాన్ తేనె  సాయిబాబా ఆలయంలో  భక్తులు విశేష పూజలు చేసి తమ భక్తిశ్రద్ధలను చాటుకున్నారు. నందిపేట్ కేదారేశ్వర ఆశ్రమంలో మంగి రాములు మహారాజు స్వామికి భక్తులు పాదపూజలు చేశారు. ఈ సందర్భంగా మంగి రాములు మహారాజ్ మాట్లాడుతూ మనుషులకు ఓర్పు సహనంతో పాటు పెద్దలపట్ల భక్తి గౌరవాలు కలిగి ఉండాలన్నారు. కేదారేశ్వర ఆశ్రమానికి  చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు తండోపతండాలుగా వచ్చి మంగి రాములు స్వామీజీ ఆశీస్సులు పొంది అన్న ప్రసాదాలు స్వీకరించారు. గురు పౌర్ణమి సందర్భంగా  పలు పాఠశాలలలో  విద్యార్థులు గురువులను సన్మానించి తమ అభిమానాన్ని చాటుకున్నారు.

IMG-20260729-WA0707

Views: 2

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

అనంతగిరి శ్రీ అనంత పద్మనాభస్వామి పెరుగు బసంతోత్సవం అనంతగిరి శ్రీ అనంత పద్మనాభస్వామి పెరుగు బసంతోత్సవం
మర్పల్లి,: వికారాబాద్ జిల్లా కేంద్రంలో నీ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అనంతగిరి శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో బుధవారం నిర్వహించిన పెరుగు బసంతోత్సవంలో తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి గడ్డం...
14 మందికి క్వార్టర్ల కేటాయింపు 
ఘనంగా భక్తిశ్రద్ధలతో గురుపౌర్ణమి వేడుకలు
‘క్యాతన్ పల్లిలో’ కమిషనర్ విధులకు ఆటంకం 
విద్యార్థుల అభ్యాస లోపాలపై ప్రత్యేక దృష్టి సారించాలి
భక్తులతో కిటకిటలాడిన సాయిఆలయాలు
వన్యప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత