సీపీఐ శతాబ్ది సభను జయప్రదం చేయాలి – సింగరేణి కార్మికులకు ఏఐటీయూసీ పిలుపు

WhatsApp Image 2026-01-17 at 10.32.13 AM

 

కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం సింగరేణి సెంట్రల్ వర్క్ షాప్ మరియు మెయిన్ వర్క్ షాప్ లలో శుక్రవారం ఉదయం గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ నిర్వహించారు.ఈ సమావేశంలో ఏఐటీయూసీ అదనపు ప్రధాన కార్యదర్శి మిరియాల రంగయ్య మాట్లాడుతూ, ఈ నెల 18న ఖమ్మం పట్టణంలో జరిగే సీపీఐ పార్టీ శతాబ్ది వేడుకల ముగింపు భారీ బహిరంగ సభకు సింగరేణి సంఘటిత, అసంఘటిత కార్మికులందరూ అధిక సంఖ్యలో పాల్గొని సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘంగా ఏఐటీయూసీ ఎన్నికైన నాటి నుంచి కార్మికుల సమస్యలపై నిరంతరం పోరాడుతూనే ఉందన్నారు. కార్మికులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలైన సొంత ఇంటి పథకం అమలు, పెర్క్స్‌పై ఇన్‌కమ్ ట్యాక్స్‌ను యాజమాన్యమే చెల్లించాలి, మారుపేర్ల సమస్య పరిష్కారం, మెడికల్ బోర్డు ఏర్పాటు చేయకుండా యాజమాన్యం కాలయాపన చేయడంపై తీవ్రంగా మండిపడ్డారు.సీ & ఎండీ స్థాయి స్ట్రక్చర్ కమిటీ సమావేశంలో ఒప్పుకున్న కార్మిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అలాగే నాలుగు లేబర్ కోడ్స్‌కు వ్యతిరేకంగా ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సమ్మెకు అన్ని మైన్స్ మరియు డిపార్ట్మెంట్లలోని కార్మికులు పాల్గొని సమ్మెను విజయవంతం చేయాలని కోరారు.
    శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో ఏఐటీయూసీ గౌరవ అధ్యక్షులు, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు కార్మిక సమస్యలపై ప్రస్తావించడంతో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సింగరేణి కార్మిక సమస్యలపై సమీక్ష నిర్వహించారని గుర్తు చేశారు. భవిష్యత్తులో కూడా కార్మికుల సమస్యల పరిష్కారానికి ఏఐటీయూసీ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు సెంట్రల్ సెక్రటరీ వంగ వెంకట, కార్పొరేట్ కార్యదర్శి ఎస్.వి. రమణమూర్తి, సహాయ కార్యదర్శి రాము, కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ క్రిస్టోఫర్, సెంట్రల్ వర్క్ షాప్ పిట్ సెక్రటరీ నరేష్, అడ్వైజర్ రాజేశ్వరరావు, బి.రవీందర్, శ్యామ్, నరసింహ, రామ్మోహన్, మెయిన్ వర్క్ షాప్ పిట్ సహాయ సెక్రటరీ దినేష్, సత్యనారాయణ, మల్లయ్య, అజయ్ తదితరులు పాల్గొన్నారు.

Views: 8

About The Author

Vision Andhra Telugu Daily Picture

Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry's standard dummy text ever since the 1500s, when an unknown printer took a galley of type and scrambled it to make a type specimen book. It has survived not only five centuries, but also the leap into electronic typesetting, remaining essentially unchanged. It was popularised in the 1960s with the release of Letraset sheets containing Lorem Ipsum passages, and more recently with desktop publishing software like Aldus PageMaker including versions of Lorem Ipsum.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

కెసిఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వడం  కక్ష సాధింపు రాజకీయాలకు నిదర్శనం......  రావుల వెంకట రమేష్ గౌడ్ కెసిఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వడం కక్ష సాధింపు రాజకీయాలకు నిదర్శనం...... రావుల వెంకట రమేష్ గౌడ్
    వర్దన్నపేట : కెసిఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వడం అత్యంత దుర్మార్గమైన కక్ష సాధింపు రాజకీయాలకు నిదర్శనమని వర్ధన్నపేట నియోజకవర్గం అధికార ప్రతినిధి  రావుల వెంకట
3 వ వార్డు కౌన్సిలర్ గా గాజుల రాజేశ్వర్ నామినేషన్.
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యధాతధంగా కొనసాగించాలి
భూగర్భ జల వనరులను కాపాడుకోవడం అందరి బాధ్యత జిల్లా కలెక్టర్ బి. ఎం. సంతోష్
దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా మేడారం మరో రికార్డు..
గాదిగూడలో సీఎం కప్ క్రీడాపోటీలు ప్రారంభం
మర్పల్లిలో ‘డిప్యూటేషన్’ల పర్వం