సీఎం రేవంత్ రెడ్డి పర్యటన వేళ బీజేపీ, బీజేవైఎం నాయకుల ముందస్తు అరెస్ట్

 సీఎం రేవంత్ రెడ్డి పర్యటన వేళ బీజేపీ, బీజేవైఎం నాయకుల ముందస్తు అరెస్ట్

చౌటకూర్, : సంగారెడ్డి జిల్లాలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో చౌటకూర్ మండలానికి చెందిన బీజేపీ, బీజేవైఎం నాయకులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. సీఎం పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా భద్రతా చర్యల్లో భాగంగానే ఈ అరెస్టులు చేసినట్లు సమాచారం.పోలీసుల చర్యపై బీజేపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఇన్ని సంవత్సరాలు గడిచినా ప్రజాస్వామ్యంలో ప్రజల పక్షాన నిలిచి ప్రభుత్వాన్ని ప్రశ్నించే స్వేచ్ఛ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశ్నించి నందుకు అరెస్టులు, నిర్బంధాలకు పాల్పడటం సరికాదని మండిపడ్డారు. అక్రమ కేసులు, ముందస్తు అరెస్టులతో ప్రతిపక్షాల గొంతు నొక్కలేరని నాయకులు హెచ్చరించారు. ప్రజా సమస్యలపై నిలదీయడం తమ ప్రాథమిక హక్కు అని, నిర్బంధాలు మానుకుని ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని డిమాండ్ చేశారు.ఈ నిరసన/కార్యక్రమంలో నాయకులు ప్రవీణ్, ప్రభు గౌడ్, రాజు మాస్టర్, మంగలి రాము, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
Views: 97

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News