వృత్తి శిక్షణ కోర్సులకు శిక్షకులు అవసరం
మందమర్రి, (మంచిర్యాల) : సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించనున్న వివిధ వృత్తి శిక్షణ కోర్సులలో అభ్యర్థులకు శిక్షణ ఇచ్చేందుకు అర్హులైన శిక్షకుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు మందమర్రి ఏరియా డిజిఎం పర్సనల్ సి.హెచ్ అశోక్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాగా టైలరింగ్,ఫ్యాషన్ డిజైనింగ్,బ్యూటీషియన్ 3 నెలలు, కంప్యూటర్ డిటిపి 2 నెలలు కోర్సులకు అవసరమన్నారు. సంబంధిత కోర్సులలో తగిన అర్హత,అనుభవం కలిగిన ఆసక్తిగల అభ్యర్థులు తమ దరఖాస్తులను అందించాలన్నారు. విద్యార్హతల సర్టిఫికెట్లు,అనుభవ సర్టిఫికెట్ కోర్సుకు సంబంధించిన క్వాలిఫికేషన్ సర్టిఫికెట్,ఆధార్ కార్డ్,రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు జత చేయాలన్నారు.అభ్యర్థులు తమ ధ్రువపత్రాల జిరాక్స్ లతో కూడిన దరఖాస్తులను మందమర్రి జి.ఎం కార్యాలయంలోని జి.ఎం.పి.ఎ సెక్షన్ నందు ఇవ్వాలన్నారు. ఈ నెల 30 లోపు దరఖాస్తులను సమర్పించాలని సూచించారు.
Views: 9
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
22 Jul 2026 18:21:04
చౌటకూర్ : చౌటకూర్ మండల కేంద్రంలోని ఎంపీపీఎస్ చౌటకూర్ పాఠశాల ఆవరణలో విద్యుత్ తీగలను తాకుతూ ప్రమాదకరంగా ఉన్న చెట్ల కొమ్మలను సంబంధిత అధికారులు తొలగించారు.ఇటీవల విద్యుత్...
